నా భావాలు

8, డిసెంబర్ 2016, గురువారం

కలల అలలపై  తేలే సరసిజ  నీవైతే ,                                                                                                                            
ఆశల వూహలపైవిహరించే  విరితావిని నేనౌతా ,                                                                                                              మధుర  మనోజ్ఞ  నవ  కావ్య  నాయిక నీవైతే ,                                                                                                                  
నీలాంబరిలో నిలిచిన రేరాజును  నేనౌతా  నేస్తమా !!
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 2:35 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

20, అక్టోబర్ 2016, గురువారం

ప్రేమంటే  అర్ధమే  తెలియని  లేతబాల్యం లో ,                                                                                                      
అందమైన  ఆటలెన్నో  తోటలో  ఆడుకున్నాం ,                                                                                                  
కోయిలమ్మ  తీయ  తీయని  కుహుకుహూ లతో   మైమరిచాం ,                                                                          
నా పాటలో  నీ మాట  కలిపి  భావాలను  పంచుకున్నాం ,                                                                                      
సాగర సంగమ  తీరం లో  వడి వడి  అడుగుల  పరుగులు ,                                                                                
ఎన్ని  యుగాలైనా  చెదరని  చెరగని  నవ  చైతన్య  జాడలు ,                                                                              
సన్నజాజుల  పరిమళాలలో మమతల  మాలలల్లుకున్నాం ,                                                                              
సన్నని  వానతుంపర్లలో  బొమ్మరిల్లు కట్టుకున్నాం ,                                                                                          
పంచదార చిలకలను  పంచుకుంటూ  తియ్యతియ్యగా  నవ్వుకున్నాం ,                                                                      
బాల్యపు మాధుర్యాలను  మనసంతా  నింపుకున్నాం ,                                                                                    
కాలగతిలో  దూరతీరాలకు  పయనమై  తరలిపోయాం ,                                                                                    
అందమైన  బాల్యం  కనులముందే కదిలిపోయింది ,                                                                                          
అందరానంత దూరాన  యెవరికి వారమయ్యాం ,                                                                                                
కానీ  ఆనాటివిరితావుల  సుగంధాలు  యీనాటి మన మధుర  జ్ఞాపకాలే  కదా ,                                                     మానసిక  బంధాలకు  మధుర  భావనలకు భాషయెందుకు??                                                                                  
దైహిక  బంధాలకు  అతీతం  గాఐ ఊపిరి  లో  ఊపిరిగా  యెన్నడో కలిసిపోయాం  నేస్తమా  !!!
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 9:45 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

19, అక్టోబర్ 2016, బుధవారం

తరువులన్నీ యిచ్చిన చిన్ని  చిన్ని  విత్తనాలను  తెచ్చుకున్నాను ,                                                                  
పొందికగా  అందంగా  నా చిన్ని  తోటలో  చల్లుకున్నాను ,                                                                                  
నారు పోసి  నీరు  పోసి  కలుపు  తీసి  కళ్ళతో  కాపాడుకున్నాను ,                                                                      
ఎదుగుతున్న  మొక్కలను  తడికళ్ళతో  తనివితీరా  చూసాను ,                                                                              
చిన్ని  సన్నజాజి  తీగ  నన్ను  చుట్టేసింది ,                                                                                                      
ఎర్ర గులాబీ  తమకంతో  నన్ను  ముద్దాడింది ,                                                                                                  
పరువాల  చామంతి  పకపకా  నవ్వింది ,                                                                                                          
ఓరగా  కోరగా  మామిడి  పిందె  నన్ను  చూసి  కళ్ళు  తిప్పింది ,                                                                        
అందాల  నా  తోటలో  తరులు  విరులు నవ  వసంత  రాగ  రంజితాలు ,                                                                      
ఋతువులన్ని  కాలగతిలో  చక  చకా తిరిగాయి ,                                                                                        
మొక్కలన్నీ  రెక్కలొచ్చి  యెగిరి  పోయాయి ,                                                                                              
తరులన్నీ తెరవు కోసం  తరలిపోయాయి ,                                                                                                    
ఒకనాటి  వసంతాన్ని  బీడుపడిన  నా  తోటలో  ,                                                                                            
మసక  బారిన  కన్నులతో  వేయి  కళ్ళతో  వెతికాను ,                                                                                    
కానరాక  వేదనతో  కనుకొలకుల  కన్నీరుతో  తరలిపోయాను  నేస్తమా !!!
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 7:43 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

5, అక్టోబర్ 2016, బుధవారం

           మంచు  కురిసిన  రాతిరి  మనసున  కలవరింత !హృదయ  ఫలకాన  నిండిన   నీ  రూపం  యెదురుగా  నిలబడినవేళ  యెదలో  కదలిక !కానీ  నీవులేవు !భ్రమ !                                                                                          
                      మమతల  మానసిక  బంధాలు  మన  యిరువురినీ  కలిపాయి ,
                      ఆనాటి ఆ  మల్లెతోటలో  కలిసిన  మన మధుర  చెలిమి , 
                      చిన్న నాటి లేలేత  బాల్యపుఆటపాటలు  యెంతబాగున్నాయో ?                                                                     
                      ప్రేమంటే  తెలియకుండా  మనం  కలుసుకున్నాం , ఆడుకున్నాం !
                      కోయిలమ్మ తీయని  గళం  లో  నా  గళం  కలిపి పాడాను !                                                                              
                      నాపాటలో  నీమాటను  కలిపి  నన్ను  మురిపించావు!
                      గుజ్జనగూళ్ళు  కట్టుకున్నాం ,బొమ్మలపెళ్ళిళ్ళు  చేసాం !                                                                                    
                      ఉషా కిరణాలతో  ఉల్లాసంగా  నవ్వుకున్నాం  మైమరిచాం,
                      యవ్వనపు  తొలిమలుపులో  విడిపోయాం  !                                                                                         
                     ఈనాటికీ సాగరసంగమతీరంలో నడయాడిన మన  అడుగుజాడలు ,
                     ఎన్నియుగాలైనా  నా  మదిలో  చెరగని  చెదరని  జ్ఞాపకాలు ,                                                                     
                      నీ వునికి  తెలియని  నాకు జ్ఞాపకాలేవునికి  అయ్యాయి ! 
                      అనుబంధం  చెప్తున్నది  నువ్వు  యెక్కడో వున్నావని ,                                                                           
                     ఆత్మీయత  చెప్తున్నది  నువ్వు  నా మనసులోనే వున్నావని ,            
                     మానసికబంధాలకు మధుర భావనలకు భాషతో  పనిలేదుగా ,                                                                    
                   నిరంతర నిర్మల  నిర్గుణ  మన   ఆత్మల కలయిక ,                                                                                  
                    అనంత  నిరంతర మధుర   పరిమళా వాహినిలో                                                                                      
                    ఎన్నడో  యెన్నడో యేకమయ్యాయి ,                                                                                                    
                    దైహిక  బంధాలతో  జీవనపోరాటం  మనకెందుకు ?                    
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 8:08 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

26, జులై 2016, మంగళవారం

గ్రీష్మం  లో  ప్రకృతి  కాంత కందిపోయెనమ్మ ,తపనతో తనువెల్ల  వడలిపోయెనమ్మ !                                                                              
ఉషోదయపు  తుషారపు వర్షపు  చినుకులతో  పుడమి  తల్లి  పులకరించెనమ్మ !                                                                                           పరవశించిన చిన్నారి   లేలేత  కొమ్మలు  విరుల పాన్పులు పరచెనమ్మ!                                                                                                    
ప్రకృతి  కాంత తనువెల్ల  మధుర  మల్లెల  పరిమళాల  తో  తడిసేనమ్మ!                                                                                            
కలువపూవుల  దరహాస  వదనం , గులాబీల  వయ్యారి  సొగసు  నను  జూసి నవ్వ  ,మది వూగె  నెత్తావి  వూయలగా మిత్రమా !
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 1:01 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
గ్రీష్మం  లో  ప్రకృతి  కాంత కందిపోయెనమ్మ ,తపనతో తనువెల్ల  వడలిపోయెనమ్మ !                                                                            
ఉషోదయపు  తుషారపు వర్షపు  చినుకులతో  పుడమి  తల్లి  పులకరించెనమ్మ !                                                                                           పరవశించిన చిన్నారి   లేలేత  కొమ్మలు  విరుల పాన్పులు పరచెనమ్మ!                                                                                                  
ప్రకృతి  కాంత తనువెల్ల  మధుర  మల్లెల  పరిమళాల  తో  తడిసేనమ్మ!                                                                                            
కలువపూవుల  దరహాస  వదనం , గులాబీల  వయ్యారి  సొగసు  నను  జూసి నవ్వ  ,మది వూగె  నెత్తావి  వూయలగా మిత్రమా !
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 1:00 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

22, జులై 2016, శుక్రవారం

భారతీయుల  దాస్య  సంకెలలను  తెంప అవతరించిన  మహనీయులు !                                                                                            
భరత మాత కన్నీరు  తుడిచిన నిస్స్వార్ధ  దేశ  భక్తుడు !                                                                                                              
బానిస  బతుకుల  విముక్తికై  పోరాటమే  మార్గమన్న  విప్లవ  మూర్తి!                                                                                              
"స్వరాజ్యమే  నా జన్మ  హక్కు "భారత జాతీయోద్యమ  పిత!                                                                                                       లోకమాన్య  శ్రీ బాల గంగాధర  తిలక్ !భారతీయ  ఆణిముత్యం  నేస్తమా !                                                                                                                    

1856 జులై  23 తిలక్  జయంతి !                                                                                                                                        
గణపతి  ఉత్సవాల ద్వారా  ఉద్యమ  స్ఫూర్తి  నింపారు !నేడూ ఉత్సవాలు  వున్నాయి కానీ  ఆ స్ఫూర్తి  ఉన్నదా ??
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 9:19 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
తెలుగు  తేజం  జాతీయ  తేజమై  ప్రభవించిన  రోజు !                                                                                                                
తెలుగు  ప్రతిభ  జాతీయ పతాకమై విలసిల్లిన రోజు  !                                                                                                                  
భారతీయ మువ్వన్నెల  జాతీయ  కేతనం  అంబరాన  రెప రెపలాడినంతకాలం !                                                                                  
మన  స్మృతి పథాన చెరగని  ముద్ర  మాన్యులు  శ్రీ  పింగళి  వెంకయ్యగాను  మిత్రమా !                                                                            

1947/జులై 22 భారత  జాతీయ కేతనం  ఆవిష్కరణ!
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 8:22 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

21, జులై 2016, గురువారం

10th  క్లాస్  వరకు  పిల్లలు  కేవలం  టీచర్  చెప్పినట్టుగా  చదువుకుంటారు . వాళ్ళకంటూ  ఆలోచన  అవకాశం  రాకుండా  టీచర్  ఊపిరి          
సలపనంత వర్క్  యిచ్చి  పూర్తిగా  ఆధారపడేవిధం  గా తయారు  చేస్తున్నారు .ఖర్మ  కాలి యే పిల్లవాడైనా సందేహాలడిగితే  కొందరు  టీచర్లు      
 కసిరి  కూర్చోబెడతారు .కొందరు  టీచర్లు   మాత్రం  ఓపికతో  వారి  సందేహాలు  తీర్చడానికి  ప్రయత్నిస్తారు . అసలు  అంకం  యిక్కడే మొదలు !
 సందేహాలకు  కొద్దిగా  సమాధానాలు  దొరికిన  పిల్లవాడికి  చదువులో  ఆసక్తి  కలిగి  స్వయం  సమస్యలను  పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాడు
అలంటి  విద్యార్థులు  జీవితం లో  పైకి  వస్తారు .కానీ  వారికీ  ఇంట్లో  కూడా  ప్రోత్సహం  వుండాలి.తల్లి  తండ్రులకి  విద్యార్ధులకి  అభివృద్ధిలోకి
 రావాలనే  తీవ్ర  సంకల్పం  వుండాలే కానీ  డబ్బు ,వసతి  సమస్యే  కాదు !వీరి శాతం  తక్కువ ! చదువు  మీద  ఆసక్తి  ఉంన్నా అడుగడుగునా
నిరుత్సహపరచే   పరిస్థితులు  యెదురైతే  జీవితం  కొంత  గందరగోళం  అవుతుంది .అలంటి  పరిస్థితులలో  కూడా  స్వయం  కృషి తో  పైకి        
వచ్చిన  వాళ్ళు  వున్నారు . ఇకపోతే  కొందరు  తల్లితండ్రులు  కేవలం  డబ్బు  వున్నదని  అహంకారం  తో అడుగడుగునా  ప్రతి  విషయాన్ని    
 డబ్బుతో  పోలుస్తారు !చదువును  కూడా  కొనాలనే  చూస్తారు .పిల్లవాడికి  చిన్నప్పటినించి  ధనమదం ఒకవిధం గా  పెద్దవాళ్ళే  నేర్పుతారు .
చదువు కో అక్కర్లేదు  చదువు  కొంటె  చాలు  అనే  అవగాహనతో  పెరుగుతారు . తల్లితండ్రుల  సపోర్ట్  కూడా  తోడవుతుంది .
 ఇంటర్మీడియట్  లో  యీ మూడు  రకాల  వాళ్ళు  వారికీ  తగ్గ  విధం  గా  చదువుకుని   రెండేళ్లు  పూర్తీ చేస్తారు .ఎంసెట్  యీ  రోజుల్లో
ఒక  ప్రహసనం  అయ్యింది .ప్రతివారు  వ్రాస్తున్నారు ! రిజర్వేషన్  పుణ్యమా  అని  రాంక్  యెంత  అయినా  పర్వాలేదు  సీట్  ఖాయం .
 ఇందులో పేపర్  లీకులు !పేపర్  కొనుక్కోవడాలు !అసలు  మన విద్యా వ్వ్యవస్థ  పురోగమనమా తిరోగమనమా ? అవగాహన,ప్రాక్టికల్  అనుభవం  లేని  చదువులు  ఎందుకు ? వ్యక్తిగా  యెదగనివ్వని చదువులు  ఎందుకు ? చదువులు  వ్యక్తిత్వ  వికాసానికి  తోడ్పడాలి , మనిషి
యెదుగుదలకి తోడ్పడాలి .విద్యారంగానికి  యెన్నో కోట్లు  ఖర్చు  పెడుతున్నారు . ఫలితాలు  మాత్రం  ఆశించినంత  స్థాయిలో  లేవు !కారణం  పెద్దలు  ఆత్మవిమర్శ  చేసుకోవాలి !

వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 7:12 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
10th  క్లాస్  వరకు  పిల్లలు  కేవలం  టీచర్  చెప్పినట్టుగా  చదువుకుంటారు . వాళ్ళకంటూ  ఆలోచన  అవకాశం  రాకుండా  టీచర్  ఊపిరి          
సలపనంత వర్క్  యిచ్చి  పూర్తిగా  ఆధారపడేవిధం  గా తయారు  చేస్తున్నారు .ఖర్మ  కాలి యే పిల్లవాడైనా సందేహాలడిగితే  కొందరు  టీచర్లు      
 కసిరి  కూర్చోబెడతారు .కొందరు  టీచర్లు   మాత్రం  ఓపికతో  వారి  సందేహాలు  తీర్చడానికి  ప్రయత్నిస్తారు . అసలు  అంకం  యిక్కడే మొదలు !
 సందేహాలకు  కొద్దిగా  సమాధానాలు  దొరికిన  పిల్లవాడికి  చదువులో  ఆసక్తి  కలిగి  స్వయం  సమస్యలను  పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాడు
అలంటి  విద్యార్థులు  జీవితం లో  పైకి  వస్తారు .కానీ  వారికీ  ఇంట్లో  కూడా  ప్రోత్సహం  వుండాలి.తల్లి  తండ్రులకి  విద్యార్ధులకి  అభివృద్ధిలోకి
 రావాలనే  తీవ్ర  సంకల్పం  వుండాలే కానీ  డబ్బు ,వసతి  సమస్యే  కాదు !వీరి శాతం  తక్కువ ! చదువు  మీద  ఆసక్తి  ఉంన్నా అడుగడుగునా
నిరుత్సహపరచే   పరిస్థితులు  యెదురైతే  జీవితం  కొంత  గందరగోళం  అవుతుంది .అలంటి  పరిస్థితులలో  కూడా  స్వయం  కృషి తో  పైకి        
వచ్చిన  వాళ్ళు  వున్నారు . ఇకపోతే  కొందరు  తల్లితండ్రులు  కేవలం  డబ్బు  వున్నదని  అహంకారం  తో అడుగడుగునా  ప్రతి  విషయాన్ని    
 డబ్బుతో  పోలుస్తారు !చదువును  కూడా  కొనాలనే  చూస్తారు .పిల్లవాడికి  చిన్నప్పటినించి  ధనమదం ఒకవిధం గా  పెద్దవాళ్ళే  నేర్పుతారు .
చదువు కో అక్కర్లేదు  చదువు  కొంటె  చాలు  అనే  అవగాహనతో  పెరుగుతారు . తల్లితండ్రుల  సపోర్ట్  కూడా  తోడవుతుంది .
 ఇంటర్మీడియట్  లో  యీ మూడు  రకాల  వాళ్ళు  వారికీ  తగ్గ  విధం  గా  చదువుకుని   రెండేళ్లు  పూర్తీ చేస్తారు .ఎంసెట్  యీ  రోజుల్లో
ఒక  ప్రహసనం  అయ్యింది .ప్రతివారు  వ్రాస్తున్నారు ! రిజర్వేషన్  పుణ్యమా  అని  రాంక్  యెంత  అయినా  పర్వాలేదు  సీట్  ఖాయం .
 ఇందులో పేపర్  లీకులు !పేపర్  కొనుక్కోవడాలు !అసలు  మన విద్యా వ్వ్యవస్థ  పురోగమనమా తిరోగమనమా ? అవగాహన,ప్రాక్టికల్  అనుభవం  లేని  చదువులు  ఎందుకు ? వ్యక్తిగా  యెదగనివ్వని చదువులు  ఎందుకు ? చదువులు  వ్యక్తిత్వ  వికాసానికి  తోడ్పడాలి , మనిషి
యెదుగుదలకి తోడ్పడాలి .విద్యారంగానికి  యెన్నో కోట్లు  ఖర్చు  పెడుతున్నారు . ఫలితాలు  మాత్రం  ఆశించినంత  స్థాయిలో  లేవు !కారణం  పెద్దలు  ఆత్మవిమర్శ  చేసుకోవాలి !

వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 7:11 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

20, జులై 2016, బుధవారం


వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 11:52 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
 మన  విద్య !!!!!!చదువు  కొంటున్నామా?కుంటున్నామా? బోధ పడడం  లేదు .ఎన్నో  విద్యాలయాలు , ఎన్నో  ఉపశాఖలు,ఎందరో  ఉపాధ్యాయులు , అయినా  నానాటికి  తీసికట్టు  నాగబోట్లు !లోపం  ఎక్కడుంది ?విశ్లేషించి  చూస్తే   నా మటుకు  నాకు  కలిగిన  కొన్ని అభిప్రాయాలను  పంచుకోవాలనుకుంటున్నాను !                                                                                                                  

ఇళ్లల్లో  పిల్లలపైన తల్లితండ్రుల  పర్యవేక్షణ  తగ్గింది . ఉదయాన్నే  లేవడం  చాలామంది  చెప్పాలంటే  మర్చిపోయారు !బడికి  వెళ్లే  అరగంట  ముందు  లేచి  గబగబా  పుస్తకాలు సద్దుకుని  ఇంత తిని  కొంత  బాక్సులో  పెట్టుకుని  పరుగెత్తడం !బడి దగ్గర  వున్నవాళ్ళ  పరిస్థితి  యిది .
 దూరంగా  వున్న బల్ల  పరిస్థితి  చూద్దాం . తెల్లారం గానే  ఇంటి  ముందు  బస్సు  సిద్ధం .నిద్రమత్తులోనే  తయారు  అయ్యి  బస్సు  ఎక్కుతారు .
ఆ బస్సు  ఊరంతా  తిరిగి  బడికి  వచ్చేటప్పటికి  దగ్గర  దగ్గరగా  రెండు గంటలు !ఇదంతా  దేనికి ? వాళ్ళు  బాగా  చదువుకోవాలాలనే  కదా ?
మరి  ఇంటి దగ్గర  తల్లి  తండ్రులు  వాళ్ళకోసం   జాగ్రత్త  తీసుకోలేరా?పిల్లల  పుస్తకాలను  చెక్  చెయ్యాలి .corrections  అయినయ్యా లేవా  చూడాలి . కాకపోతే  కారణం  అడగాలి . వాళ్ళ  /సమస్య  తెలుసుకుని  పరిష్కారం  వెదకాలి !ఎప్పుడో బుద్ధి  పుట్టినప్పుడు కాదు ప్రతి రోజు  దాని కోసం  కొంత  సమయం  కేటాయించాలి . అప్పుడు  పిల్లలలో   చదువు  మీద  శ్రద్ధ  కలుగుతుంది ,అమ్మ  నాన్న  తమని  గమనిస్తున్నారన్న  భయం  కూడా  కలుగుతుంది !తల్లి తండ్రి కూడా ఉదయాన్నే లేచి  కార్యక్రమాలు  ముగించుకుని  పిల్లలను  ఉదయాన్నే
లేచి చదువు  కోవడం  అలవాటు  చెయ్యాలి .,ఇంటి వాతావరణం  ప్రశాంతం  గా  పవిత్రం  గా  వుండాలి.రోజూ బడికి  వెళ్లేముందు  దైవ  ప్రార్ధన
చెయ్యాలి .అలాగే  సాయం కాలం బడి నించి  రాగానే  కాళ్ళు చేతులు  కడుక్కుని  బట్టలు  మార్చుకోవాలి ..ఏదైనాతేలిక  గా  తిని అమ్మ తో
సరదా కబుర్లు  కాసేపు  చెప్పి  ఆదుకోవడానికి  వెళ్ళాలి .ఒక గంట  ఆడుకుని  వచ్చి  శుభ్రం గా  స్నానం  చేసి  బట్టలు  మార్చుకోవాలి .    
బడలిక  తగ్గి  శారీరికంగా  మానసికంగా  ఉత్తెజిలవుతారు .అప్పుడు  పాఠ్య  పుస్తకాలు  తీసి  చదువుకుంటే  హోంవర్క్  చేసుకుంటే  అన్ని పాఠ్య
విషయాలు  సులభం గా  బుర్రలో కి  యెక్కుతాయి హాయిగా  అమ్మ  పెట్టిన  అన్నం తిని  కమ్మటి  నిద్ర  పోవాలి.ఇంట్లో  యీ  రకం గావాతావరణం  వుంటే ప్రతి  ఇల్లు వాణినిలయమే                                                                                                                       !  
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 11:51 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

10, జులై 2016, ఆదివారం

మన సాంఘిక వ్యవస్థలో సామాజిక మార్పులు చక చక జరిగి పోతున్నాయి .ఎన్నో యెన్నో మార్పులు .మనం కొన్ని మార్పులు
పరిశీలిద్దాం . కుటుంబ వ్యవస్థలో పురుషుడు ఆర్ధికం గా తన కుటుంబం కోసం శ్రమించి తనవారిని సుఖపెట్టడానికి తపన పడేవాడు స్త్రీ పురుషుడి కి మానసికంగా తోడునీడ గా వుండి అతనికి అన్ని విధాలుగా తోడు నీడ గా వుండి సంసారాన్ని చక్క దిద్దుకునేది . ఉమ్మడి కుటుంబాలు !అత్తగారు ,మామగారు , మరుదులు ,ఆడబిడ్డలు అందరూ కలసి మెలసి సఖ్యత తో వుండేవాళ్ళు . చిన్న
చిన్న విభేదాలు వున్నా వెంటనే పరిష్కరించుకునేవారు . ముఖ్యంగా ఇంటి పెద్ద కు గౌరవం యిచ్చేవారు. ఆయన మాటే వేద వాక్కు
ఇంటి పెద్ద కూడా అంటే పెద్దరికం తో హుందాగా ఉండేవారు .అసందర్భ ప్రేలాపనలు , అహంకారం చూపించకుండా తన గౌరవాన్ని
నిలుపుకునే వారు .కుటుంబ సభ్యులందరినీ ఒక పద్ధతిలో నడిపే వారు .అత్తగారు కూడా కోడలిని తన పిల్ల లాగానే చూచుకుని
మంచి చెడూ చెప్పేవారు .కుటుంబంలో శుచి శుభ్రం ,నిత్యపారాయణం అన్ని పద్ధతి గా జరిగి పోతూ వుండేవి.అలాంటి కుటుంబ వ్యవస్థలో పెరిగిన పిల్లలు కూడా చక్కటి మానసిక దృక్పథం తో పెరుగుతారు . చిన్నతనం లోనే చక్కటి సంస్కార బీజాలు నాటుకున్నందువలన వారు పెద్దయిన తర్వాత సంస్కారవంతమైన పౌరులుగా కుటుంబానికి ,సమాజానికి ,దేశానికి దిశానిర్దేశకులు
అవుతారు .
నేటి ప్రస్తుత కుటుంబ వ్యవస్థ పరిశీలిద్దాం !పురుషుడు యిప్పుడు కూడా ధనార్జనే ధ్యేయం గా వున్నాడు .కానీ సమాజపు కొన్ని
ఆకర్షణలకు గురి అవుతున్నాడు .ఉమ్మడి కుటుంబాలు లేవు .ఇంటి పెద్ద అనే మాటే లేదు . తప్పు ఒప్పులను దిద్దే పెద్ద లేరు .
క్రమంగా మాబాసిక దౌర్బల్యం ఒక దురలవాటు గా మారుతున్నది .ఆర్ధిక చిక్కులు మొదలవుతాయి . ఇంటి ఇల్లాలు కూడా
సహనాన్ని కోల్పోతున్నది .ఇల్లు రణరంగం అవుతున్నది . ఎప్పుడయితే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందో అప్పుడే
కుటుంబ పతనం ప్రారంభం అవుతుంది !విలువలు దిగజారుతాయి . ఆ ప్రభావం పిల్లలమీద పడుతుంది . ఇక వారి పతనం మొదలవుతుంది . అవగాహన లేని పెంపకం లో అయోమయ అవస్థలో ఒక ధేయం లేకుండా పెరుగుతారు . ఎందుకూ పనికి
రాని పౌరులుగా తయారు అవుతారు . క్రమంగా చేతకాని తనం కాస్తా ఉగ్రవాదం అవుతుంది . దేశాన్ని కే సమస్య గా తయారవుతారు .
విశ్లేషిస్తే ఈనాటి మన కుటుంబ వ్యవస్థ లో స్త్రీ పురుషుడు ఇద్దరూ ఒకరికొకరుగా ఉండడం తగ్గిపోతున్నది . భార్యగా అతనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదు . అలాగే పురుషుడు కూడా తన భార్య కష్ట సుఖాలను అర్ధం చేసుకోవడం లేదు . ఇద్దరి మధ్య ఆర్ధిక సంబంధం తప్ప అనురాగ సంబంధం అదృశ్యమవుతున్నది. స్త్రీ సమాన హక్కుల కోసం ప్రశ్నిస్తున్నది .నాదృష్టి లో
పురుషుడి లో ఏనాడు అర్ధభాగమయ్యిందో ఆనాడే ఆమెకు అన్ని హక్కులు వచ్చాయి . బాధ్యతలు వున్ననాడు హక్కులను
ప్రశ్నించ వచ్చును . స్త్రీ పురుషులిరువురు మమతానుబంధాలతో జీవన యానం జరిపితే వారి పిల్లలు కూడా చక్కని సంస్కారవంతమైన పౌరులుగా తీర్చి దిద్దబడతారు .
పాఠకులారా అన్ని కుటుంబాలు ఇలా వున్నాయని నేను చెప్పటం లేదు . కానీ నేడు వారి శాతం యెక్కువగా వున్నది . ప్రస్తుత
పరిణామాలు చూచిన తర్వాత నాలోని ఆవేదనకు అక్షర రూపం ఇచ్చాను . ఎక్కడయినా తప్పుగా నేను వ్రాస్తే దయచేసి
నన్ను మన్నించమని మనవి చేస్తున్నాను .ఇవి కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ! సానుకూలంగా అర్ధం చేసుకుంటారని ఆశిసుస్తున్నాను.
Like
Like
Love
Haha
Wow
Sad
Angry
Comment
Share
11
Comments
Rajya Lakshmi
Write a comment...

వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 3:29 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

19, జూన్ 2016, ఆదివారం

వేదాలు ఘోషించిన పవిత్ర కర్మ భూమి ! 
విమల చరిత కలిగిన పావన భూమి ! 
బాల వటువు కి తండ్రి యే గురువు గా భాసించిన పుణ్య భూమి ! 
చిన్నారి చిన్ని తలంపుల తొలి అక్షర శిల్పి ! 
పితృ దేవో భవ!ప్రణమిల్లిన యీ భరతభూమిలో తండ్రిని మించిన దైవం వున్నదా!
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 7:34 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

24, మార్చి 2016, గురువారం

Alas  This is not what I thought life was
I knew there were crimes and evil  men
Misery and hate,nor did I hope to pass
Untouched by suffering,through the rugged glen

In mine own heart I saw as  in glass
The hearts of others-And when
I went among my kind,with triple brass
Of calm endurance,my weak breast Iarmed
To bear scorn fear and hate,a woful mass

P. B.sHELLEY


 జీవితం  యిలా  వుండేదని  నేను  ఎప్పుడూ  ఆలోచించలేదు
అక్కడ  యెన్నో  నేరాలు  యెంతో  చెడు  వుండేదని  నాకు  తెలుసు
లోభత్వం  అసహ్యం  వుండేదని  నాకు తెలుసు ,అంతేకాదు
బాధలను  ,కరకు  రాతి  గుండెలను  తప్పుకోలేనని  తెలుసు  కున్నాను !


నా స్వచ్చమైన  హృదయ  గాజుపలక  నుండి  తొంగి  చూసాను
అన్ని  మనస్తత్వాలు  నాకు  వివరంగా  తెలిసిపోయాయి
నాలోని  నన్ను    మానసికంగా  గట్టి  పరిచాను
ఓర్పుతో  క్షమతో   నా  సున్నిత  హృదయానికి
అవహేళన , చీత్కా రాలను , నీచ  మనస్తత్వాలను  భరించే  కవచాన్ని  తొడిగాను 
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 7:10 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

22, మార్చి 2016, మంగళవారం

వేయిపడగలు  -- 4వ  అధ్యాయము --
గత  3అధ్యాయాలు  గతవైభవాన్ని  తెలుపుతాయి . 4వ  అధ్యాయము  లో  మారుతున్న  మనుషుల  మనస్వత్తాన్ని  చాలా  బాగా  తెలిపారు . రంగారావు  పట్టాభిషేకం !రంగారావు  గారి తండ్రి   నాయుడుగారు

 ప్రజల  వ్యవహారం  లో  చాలా  వుదారం  గా  వుండేవారు .ప్రజల  అన్ని  అవసరాలు  ఆదుకునేవారు .అంతే  కాదు  కళా  పోషకులు  కూడా ! విశ్వనాథ  సత్యనారాయణగారు కోటను  వర్ణించిన  తీరు   !'కోట  కు సింహ ద్వారమొకటి వెనుక  ద్వారమొకటి  వుండెను . కోట  ఆంగ్లేయులు పూర్తి గా  దేశము స్వాధీ నము  కానపుడు  కట్టినది  కాన
కోటగోడ  కొండ రాతితో  కట్టబడి  ఒక  శక టము  సునాయాసముగా  పోవుటకు  వీలైనంత  యెడము   కలదై  కందకమును  కూడా  కలిగి వుండెను . కందకము  పాడుపడి  వున్నది . వూరున్న వైపు కందకము  పూడ్చ బడి  వున్నది .  కొన్ని యెడల  కోటగోడ  శిథిల మై  పోయెను . అది మరల  మరమ్మత్తు  చేయుటకు  దొరతనము  వారి  అనుమతి  లేక యట్లే  వున్నది . '
కోట  వర్ణన  చదువుతుంటే  అసలు  మనం  కోట  పక్కన  నిలుచున్న  భావం  కలుగుతున్నది  కదూ !తెల్లదొరల
పాలన  లేనప్పుడు  ప్రజలు  యెంత  స్వేచ్ఛగా  వున్నారో  యెంత  హాయిగా  వున్నారో  అలాగే  తెల్లదొరల  పాలనలో  కోట  మరమ్మత్తుకు  కూడా  వారి  అంగీకారం  కావలసిన  దయనీయ  స్తితిని  తెలుపడం  లో  కవి  ఆనాటి  సమాజపు  మనిషి  ఆలోచనలను  తెలిపారు .
మరో వర్ణన 'కోట  విశాలమైన పదివేల  మంది జనులు  సుఖముగా  నివసించుటకు వీలై నదిగా  వుండెను .    కోటలో  నెల్లెడ  వున్నతములైన   వృక్షములు  దిగుడు  బావులు  ఫల వృక్షములు  బహు  జాతులు  గల  
తీ వలు  కలవు !కోటలో దక్షిణ  దిశ  యందు  పెద్ద  సావడి  లో  బోనులలో  సమర్పబడి  పులులు
చిరుతలు  సివంగులు  కొరనాసి గండ్లు  కోతులు  మొదలైన  అపూర్వ  జంతువులు  నానాజాతి  పక్షులును
పెంచబడుచుండెను !వానిని  చూచుటకు కొత్త వారెప్పుడును  వచ్చుచునే  యుందురు !కోటయే  వస్తు ప్రదర్సన
శాల ;కోటయే  పుస్తక  భాండాగారము ;కోటయే  విద్యా  పోషణ  సం స్థ !కోటయే  తల్లి !కోటయే  తండ్రి !కోటయే
స ర్వముగా  యుండేది '
కవి  భావుకత  కవి  కాల్పనిక  శక్తి  యెంతో  యెంతో  మధురం !అసలు  ఆయన  వేయి  పడగలలో  జీవించారు !
ప్రతి  చిన్న  అంశము  చదువుతుంటే  మనం  కూడా  అక్కడ  ఒక  పాత్రగాజీవిస్తాం
కవి  సార్వభౌమా  మీకు  శిరస్సు  వంచి  ప్రణ మిల్లుతున్నాను !
 

వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 3:12 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

21, మార్చి 2016, సోమవారం

వేయి  పడగలు ! మూడవ  అధ్యాయములో  కవి  గారు   గిరికను  యెంత  బాగా  వర్ణించారో !
'ఆ  నవ్వినది  పన్నెం డేం డ్ల  పిల్ల !దాని  యొడ లి  పైకి  తెలియకుండ  మన్మథుడు  వచ్చు  చున్నాడు . దాని  తెల్లని  పలు వరుస  సుద ర్శ నా యుధపు టంచుల వలె  పదునుపెట్టి  నట్లుండెను .  దాని  చెవులు  శ్రికారములై
పాంచ జన్యము  లట్లుండెను . దాని  కన్నులు  కమలములు ,దాని  నాసిక  కౌ మో దకి .దాని   భ్రూ యుగము  శా రజ్ఞము    ద్విథా  విభక్త మైనట్లుండెను . దాని  మూర్తి  వికుం ఠ  మై  మనొజ్ఞ  మయ్యెను . దాని  పేరు  దేవదాసి '
ఈ వర్ణన  యెంత  మధురం !లేలేత  అందాలను  యెంత  కమనీయంగా  తెలిపారు !నేను  చదివి  మైమరచిపోయాను !
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 8:37 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

6, మార్చి 2016, ఆదివారం

మన వెల లేని గతం ఈ నాడు విల విల లాడుతున్నది

మన  భారత  దేశం  వున్నత విలువలకు  నెలవైన  బంగారు  పాలవెల్లి . మానవీయ  విలువలకు  ప్రపంచదేశాల కే
తలమానికం !అన్నిదేశాల  ప్రజలు   సమాజంలో  ఎలా  మెలగాలో  భారతియసమాజం  దగ్గర  నేర్చుకున్నారు .
ఆ  నాటి  ఆ  మహోన్నత  విలువలే  ఈ  నాటికి  మన  భారతీయుడు  కనపడగానే అప్రయత్నంగా  రెండు  చేతులు  జోడించి  అంజలి  ఘటించే లా  చేసాయి . కానీ  ఈ  మాధుర్యం  గతం లో కి  జారింది . నేడు  ఆ  సంస్కృతి  ఎక్కడ !
మన  నడవడి ఎందుకిలా  జారింది !పశ్చిమ దేశాలు వారి సంస్కృతిని మన  మీద  బలవంతంగా  రుద్దలేదు .
వారిలోని అలవాట్లను మన  జీవన  విధానానికి  అనువైనవి  మనం  గ్రహించాలి !వారి వాతావరణ  నాగరిక
ప్రభావం  వారి  జీవనవిధానం!వారికి  మనలాగా  తరతరాల చరిత్రలేదు .ఆటవిక  జీవనం లో  నించి  బాహ్య
ప్రపంచం లో  కి  వచ్చి తమకంటూ  గుర్తింపు తెచ్చుకుంటున్నారు సంస్కారాన్ని  సంస్కృతిని  వెతుకుతున్నారు మరి  మనపెద్దల  ద్వారా  లభించిన  అపార  సంస్కార  సంపద  వుంది ,చెరగని  సంస్కారం  వుంది ,కారణం ఏమిటి ఎందుకిలా  తయారవుతున్నాము ?బయటి వాళ్ళెవరు  మనల్ని  యిలా  వుండమని  ప్రోత్సహించడం  లేదు ,మన  మానసిక  దౌర్బల్యమ్  మనల్ని  పతనం  లోకి  లాగుతున్నది !మనకు  అన్ని  సుఖాలు  అనుభవించడం  అలవాటయింది ,దాని  వల్ల మంద  బుద్ధి ,బద్ధకం  మొదలయ్యాయి . .టెక్నాలజీని  వాడుకుని  సమయాన్ని  సద్వినియోగం  చేసుకొమ్మన్నారు  కానీ దుర్వినియోగము  చేసుకోమన లేదు !మన  దైనందిక  కార్యాలను  త్వరగా  ముగించుకుని  ,మనలోని  చైతన్యాన్ని  ఆలోచనలను  క్రమ  దిశలో  వాడుకోవడమే  టెక్నాలజీ  యొక్క  లక్ష్యం !ప్రస్తుత  దారుణ  మైండ్  సెట్  మారాలి ,వక్ర  ఆలోచనలను  తుంచి  వేయాలి ,ముందుగా  ఎలక్ట్రానిక్  మీడియాలో  కొన్ని  ప్రోగ్రాములను  కట్టడి  చెయ్యాలి ,అశ్లీ ల  సాహిత్యాన్ని ,దృశ్యాలను  కట్టడి  చెయ్యాలి ,!
 గృహ వాతావరణం  లో  చక్కటి  సంభాషణలు ,చక్కటి  సంస్కారం  వుండాలి ,బూతు మాటలు ,వెక్కిరింతలు ,హేళన మాటలు ,వుండకూడదు !ఇంట్లో  పెద్దవాళ్ళు ప్రతిమాట  ప్రతి చర్య ,చాలా  జాగ్రత్తగా  చాలా సున్నితంగా  వుండాలి ,ఇళ్ళల్లోని  క్రమ పద్ధతులే  యువతకు  క్రమ శిక్షణ  నేర్పుతాయి !.అలాగే  యువత  కూడా  చదువు తో  పాటు  ఏదో ఒక  లలిత కల  మీద  పట్టు  సాధించాలి !శారీ రికంగా  అలసి  పోయినప్పుడు   మధుర సంగీతం
మనసుకు  హాయి  కలిగిస్తుంది !      
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 6:29 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

3, మార్చి 2016, గురువారం

వేయిపడగలు  తొలి  రెండు  అధ్యాయాలలో  ప్రాముఖ్యత  గల  పాత్రలు  ---రామేశ్వర శాస్త్రి ,కృష్ణమనాయుడు ,వారి  ఆప్యాయతలు  మరియు  స్నేహబంధం !తొలుతగా  నా  దృష్టి  లో ,
రామేశ్వర శాస్త్రిగారు ---ఈయన  సుబ్బన్న పేటలో  5వ  తరానికి  చెందిన  వ్యక్తి -సుందర రూపి ,ఔదార్యులు ,పాండిత్య ప్రతిభ  కలవారు .నాలుగు  వర్ణముల  వారిని  పెళ్లి  చేసుకున్నారు ,అంతే  కాక  రత్నగిరి  అనే  భోగంగాన ను  చెరదీసా రు . అయన లోని  యితర  సుగుణముల  వలన ,ఆయన  చేసుకున్న  వివాహముల
విషయాలు  మరుగున  పడుతాయి . అలాగే  భార్యల  పట్ల  అయన  ప్రవర్తించిన  తీరు  కూడా  చాలా  హుందాగా
వున్నది . తనకున్న  ధనం  అందరి  అవసరాలకు  వాడుతారు  ,నిరతాన్న దాత !ప్రజాక్షేమం  కోరే  వ్యక్తిగా  అందరి  మన్ననలు  పొందుతారు . ఆలయంలో ధ్వజస్తంభానికి  బంగారపు  తొడుగు  వేయించడం ,సత్యభామాదేవికి  మాణిక్యము  పొదిగిన  అడ్డబాస  చేయించడం .ఈ  పనులన్నీ శాస్త్రి  గారి  లలితభావ  జలాన్ని  కళ్ళముందు  నిలబెట్టుతాయి ,కొన్ని  కొన్ని  సంఘటనలను  చదువుతుంటే    విశ్వ నాధులే  కళ్ళ  ముందు  నిలుస్తారు .
ఇల్లు  గడవని  రోజులలో  కూడా  వితరణ  గుణం  మనల్ని  కట్టి  పడేస్తుంది ,రామేశ్వర  శాస్త్రి  పాత్ర  సజీవ  పాత్ర
కృష్ణమనాయుడు -రాజు ,పురోహితులు  వ్యవస్థను  సక్రమంగా  నడిపినప్పుడే  సమాజం  వర్ధిల్లుతుంది .
నాయుడు గారు ,శాస్త్రిగారు ఆత్మ గౌరవాన్ని  కాపాడుకుంటూ  స్నేహబంధాన్ని  నిలుపుకుంటారు . వారి  మనసులు  మాట్లాడుకుంటాయి ,నాయుడుగారు  శాస్త్రిగారి  అప్పులన్నీ  చాలా  చాకచక్యంగా  తీర్చి  ధర్మారావుని  ఆదరించిన  తీరు  వర్ణ నాతీతమ్ !

వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 6:43 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

20, ఫిబ్రవరి 2016, శనివారం

మరణం

Death is  here and death is there                                                                                                              
Death is busy everywhere,                                        
all around,within,beneath
Above is death-and we are death

Death has set his mark and seal
On all we are and all we feel
On all we know and all we fear

First our pleasures die and then
our hopes and then our fears and when
These are dead the debt is due we die too

All things that we love and cherish
like ourselves must fade and perish
such is our rude mortal lot
love it self would, did they not

                                                    - P B Shelly

మరణమిక్కడ ,మరణమక్కడ
అంతటా  విశ్రాంతి  లేని  మరణమే
మరణమే  వలయం ,మరణమే  లోన ,మరణమే  క్రింద
మరణమే  పైనా -సందేహమేల  మనమే  మరణమా

మరణమే నాడో  తన  ముద్ర  వేసింది
మరణ  ముద్రలో  మరణ  భావనలో
మన  యెరికలొమరణమే ,మన  భయంలో  మరణమే 

కోరికలు శూన్యమై ఆశల న్నీ
ఆడి యాసలై ,భయమే  లేని నాడు
బంధాలన్నీ తెగిన  వేళ , మృత్యువే  కౌగిలి

అనుభవించిన  మధుర  స్మృతులు
ఆవిరైన  వేళ ,మమతలు  కరిగిన  వేళ
భౌతిక బంధం  తెగిన  వేళ
ప్రేమయే  మరణించిన  నిజమే  కదా  
                                                 

వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 3:50 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

18, ఫిబ్రవరి 2016, గురువారం

ఆణిముత్యాలు

నాకు  నచ్చిన  కొన్న్ని  ఆణిముత్యాలు ,వేయిపడగలు
అందమైన  పదాల  పొందికలో ,కల్పనా శైలి లో  ఈ  నాటికి  యెవరు  సాటి  రారు !
నేను  మెచ్చిన  మచ్చు  తునుకలు భావి  రచనా  పరిచయాన్ని  మనం  అందుకుంటే  ఈ  క్రింది  వాక్యాలలో  చూడవచ్చును ,
"వేసంగి  మండుటెండలు  లేత  రావిఅకుల మీద  పడి  ధగ  ధగ  లాడి  కదలినపుడు ,త ళ త ళ  మెరయు  గోధుమ వన్నె  త్రాచుల  పడగలవలె  ప్రకా శించు  చుండెను . రావి  యాకుల  చిన్ని చిన్ని తోకలు ,చాచిన  నాల్కలవలె  తోచెను . దూరమున  ఆకాశములో  తెల్లని  సన్నని  మబ్బులు  పలుచనై  చెర లాడి -తెల్లత్రాచులు  మసక లాడినట్లు ,పడగలు  విప్పినట్లు ,ఒకదానిపై  యొకడు  దూకి  కరచుకొన్నట్లు ,,పరవళ్ళు  తొక్కినట్లు  నానా రీతుల
గోచరించెను ,ఎండ  యేమో  కస టె క్కి  మహభుజంగమొకడు  కుపితమై  బుస్సుమని  పడగ విప్పి  తోక మీద  లేచి  నిలచినట్లు ,దుర్నిరీక్ష్యమైపోయెను '
ఈ  పదాల  పొందికలో  తొలి సంధ్య  నుండి  మలి  సం ధ్య  దాకా  అన్ని  గోచరమవుతాయి .
ఆలయంలోని  వేణు గోపాలుని  వర్ణన
'స్వామి  విగ్రహం  మనిసి యంత  యెత్తు  కలది .  నిత్యము  నర్చకుడు  రాయుచున్న  నూనె చేత  తడిసి  మైమరు  వె డ మిచ్చిన  తావుల  స్వామి  శరీరము  ప్రా వృ షే ణ్య  నీ ల జలద స్నిగ్ధ చ్చాయా  ముగ్ధమై  క్రొత్త కాటుక  కాంతులు  విరియ జల్లు  చుండెను ,స్వామి ముఖ కమలమున  అంటించిన  రజత మాణిక్య  మయమైన  ఊర్ధ్వ
పుండ్ర ములు  గోలోక  ద్వారము  వలె ,స్వామి  వంక  బొమలు  ముడిచి  పరిహాసముగా  చూచుచున్న  రాదికాదేవి  ద్విభ్రూమధ్యగత  త్రిరేఖా కృతి భక్తలోక  మనః ఆహ్లాదిని  యయ్యెను ,వ్యత్యస్త పాదార విం దుడై  వేణువు  వాయించుచున్నట్లు  చేయించిన దా  మూర్తి !ప్రక్కను సత్యభామా  దేవి -శృ గారమయ  మూర్తి !కుడిచేత  విలాస
కమలము  ధరించి  పొందికగా  స్వామి  నత్తుకొని  యుండెను!భగవంతుడిని  అందరము  చూస్తాము  కానీ  వర్ణన
ఆయనకే  సాధ్యము !ఆ  మహనీయునికి  నా  వందనాలు
వేయిపడగలు  మన  యింట్లో  వుంటే  భావ దరిద్రం  మనకు  ఉండదుగా ! 
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 1:43 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

17, ఫిబ్రవరి 2016, బుధవారం

వేయిపడగలు నా అనుభూతి

విశ్వనాథ సత్యనారాయణగారు  2వ  అధ్యాయములో  సుబ్బన్న పేటలో  5వ  తరాన్ని  మారుతున్న  విలువలను
సంధి యుగాన్ని  కళ్ళకు  కట్టినట్టు  వివరించారు ,అసలు  ఆయన  మనవ మనస్తత్వాలను  చదివిన  మహాముని !
రామేశ్వర శాస్త్రి  గారితో  మొదలవుతుంది
5వ  తరం లో ముఖ్య పాత్రలు  రామేశ్వర శాస్త్రి ,గారి  కుమారుడు  ధర్మారావు ,జమిందారు  కృష్ణమనాయుడు  మరియు  అయన  కుమారుడు  రంగారావు .
రామేశ్వర శాస్త్రి  వ్యక్తిత్వాన్ని  చాలా  మహోన్నతంగా  తీర్చి  దిద్దారు . నాలుగు వర్ణాల  కన్యలను  వివాహమడడము అందరికీ  న్యాయం  చేయడం  పాత్రని  మలిచిన  విధానం  కమనీయం !మానవత్వం  ,,అయన  అమూల్య  సంపద
.తన  సంపదను  నలుగురి  కొరకు ఖర్చు  పెట్టారు  అయన  ఉదార గుణం  చివరకు  ఆయనకే  బంధం  అవుతుంది . విశ్వనాథవారు  మనుషుల  ప్రవర్తనను  ధనం  వున్నప్పుడు  ఎలా  వుంటుందో  లేనప్పుడు  ఎలా  వుంటుందో
కళ్ళకు  కట్టినట్టుగా  తెలిపారు .
జమిందారు   ,కృష్ణమనాయుడు  రామేశ్వర శాస్త్రి  స్నేహ బంధం  చాలా  అపురూపం !ఒకరి  మనసు  ఒకరు  చదివినవారు . పరస్పరం  గౌరవించు కుంటూ  స్నేహాన్ని  కాపాడుకున్నారు క్రిష్ణమనాయుని  కొడుకు  రంగారావు
శాస్త్రిగారి  కొడుకు  ధర్మారావు . శాస్త్రి గారి  మొదటి భార్య  సావిత్రి ,ఆమె  కొడుకు  ధర్మారావు .,యిద్దరు  పుత్రికలు
హైమవతి ,నాంచారమ్మ .,రెండవ భార్య క్షత్రియస్త్రీ  రంగాజమ్మగారు  ఆమె  కొడుకు  రామచంద్రరాజు ,మూడవభార్య
వైశ్య స్త్రీ  హైమవతి  ఆమె  కొడుకు  ఆమెకు  యిద్దరు  పుత్రికలు ,ఒక  కొడుకు  శ్రీధరం ,ఇక  నాల్గవ  భార్య  మంగ
ఆ  అమ్మాయిని  శాస్త్రి  గారు  విచిత్ర  పరిస్తితులలో  పెళ్లి  చేసుకుంటారు ,ఆ మెకు  వింత రూ
పుకల  కొడుకు  పసిరిక  పుడ్తాడు ,శాస్త్రిగారు  రత్నగిరి  అనే  భోగాంగ న  ను  కూడా  చేర దీ సారు ,ఆమె  వలన  దేవదాసి  పుట్టింది ,రామేశ్వర శాస్త్రి  గారు మరణించేనాటికి  ధర్మారావు  వయసు  పదహారు యేళ్ళు ! కృష్ణమనాయుడు  నాయుడు
శాస్త్రిగారి  కర్మకాండకు  కావలసిన  ద్రవ్యసాయం  చేస్తారు . ఆ  రోజుల్లో  స్నేహ బంధం  ఎలావుండేదో  వేయిపడగలు
మనకు  చూపుతున్నది ,అభిమానధనుడు  ధర్మారావు ,,మానసికంగా  మరణించి  లేఖ  వ్రాసిన  విధానం
వర్ణనకు  అందదు ,కృష్ణమనాయుడు ,ధర్మారావును  ఆదరించిన  తీరు  అపురూపం !ఈ అధ్యాయములో  మారుతున్న  తరం  మారుతున్న  మానవ విలువలను ,సామాజిక  మార్పును  బాగా  విశ్లేషించారు !క్రమంగా
రంగారావు  ప్రవేశం  అన్నింటిలో  మార్పు !

వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 6:01 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

వేయి పడగలు మరపురాని అనుభూతి

కవిసామ్రాట్  శ్రీ  విశ్వనాథ  సత్యనారాయణగారి  వేయి పడగలు  చదవని  తెలుగు  వారు  వుండరేమో !రచనా శిల్పం  వూహకు  అందనిది ,కేవలం 29 రోజులలో  ఆశువుగా  చెప్పడం ,వారి  సోదరులు  వ్రాయడం ,మానవ మాతృ కులకు  సాధ్యమా ?మన తెలుగు  వారు  చేసుకున్న   పూర్వజన్మ  పుణ్యమే  అయన  ఆవిర్భావం !కల్పనా శక్తి
పాత్రల  సృష్టి ,అభ్యుదయ శైలి ,పదాల  పొందిక  నన్ను  పరవశింప  చేసింది .
సుబ్బన్నపేట  పుట్టుక _ఒక  పెదకాపు  తన  సురభి   అనే  గోవు  పుట్టలోని  సర్పానికి   పాలు యివ్వడం  చూసి
ఆశర్యంతో   తన వారికి  చెప్తాడు . ఆ  రాత్రి  అతనికి  వేయి శిరస్సులతో  సుబ్ర మ ణ్యె శ్వరుడు  గుడి  కట్టమని  పలుకుతాడు . పాపం  వారి  ఆర్ధిక లేమితో  నిస్సహాయులు !పొరుగు  గ్రామం లో  ఒక  ఆస్తిపరుడైన  బ్రాహ్మణుడు
తనకు  సంతానం  కలిగితే  స్వామి  సన్నిధిలో  వుండి  ఆలయ  ప్రయత్నం  చేస్తానని  మ్రొక్కుకుంటాడు . ఆ  పిదప
అతనికి  పుత్రోదయం !నాగేశ్వర శాస్త్రి  నామకరణం !ఆ యన  స్వామివద్దకు  చేరుతారు ,ఆలయ  నిర్మాణం  ఆలోచిస్తారు . అయన జ్యోతిష్య ,వాస్తు  బాగా  తెలిసినవారు ,ఒకరోజు  యీయన  వద్దకు  వీరన్న  అనే  వ్యక్తి  వస్తాడు . అతని  వద్ద  గల  ధనముతో  కోటకట్టి  జమిందారు  అవ్వాలన్న  కోరికను  వెలిబుచ్చుతాడు . తానున్న
ప్రదేశమే  కోటకు  యోగ్యమని   బ్రాహ్మణుడు  చెప్తారు . ఆలయనిర్మాణం ,కోట నిర్మాణం  మొదలవుతాయి .
ఆలయం లో  సుబ్రమ ణ్యె శ్వరులు ,నాగేశ్వర స్వామి ,కొలువవుతారు . విరన్ననాయుడు  వేణుగోపాల స్వామి  ఆలయం  కూడా  నిర్మిస్తారు .,ఆలయ నిర్మాణం తో  అన్ని  వసతులు  ఏర్పడు తాయి ,
కాపు  కు  ఒక్కతే  కూతురు ! ఆ  అమ్మాయిలోకి  అప్పుడప్పుడు  స్వామి  ఆవేశి స్తారు ,ఆమె  కన్యగా  వుండి
పోతుంది ,గణాచారి గా  నిలిచి పోతుంది !రానున్న  విపత్తులు  తెలుపుతుంది ,
క్రమంగా  విరన్ననాయుడి  మరణం  తర్వాత అయన  పుత్రుడు  నాగన్న నాయుడు  జమిందారు  అవుతాడు ,
బ్రాహ్మణుడు  చనిపోయి  అయన  కొడుకు  నాగేశ్వర శాస్త్రి  ఆలయాన్ని  చూసుకుంటారు ,గణాచారి  మరణం
పిదప  కాపు  అన్న  కుమార్తె  గణాచారి  అవుతుంది !ఆ  వూరు  సుబ్బన్నపేట !
ఇంతటి  కల్పనా శక్తి  యెవరికి  సాధ్యం !ఒక్కొక్క  పాత్ర  సృష్టి  అమోఘం !
ఒకరు  ప్రతినిధులు ,ఒకరు  ప్రచారకులు ,ఒకరు  వ్యాఖ్యాతలు !
విశ్వ నాథసత్యనారాయణగారికి  శిరస్సు  వంచి  ప్రణ మిల్లుతున్నాను ! 
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 2:04 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

5, ఫిబ్రవరి 2016, శుక్రవారం

మలి వయసు మనది

జీవితం  చిన్నది ,జీవనం  మనచేతిలో  వున్నది ,సమయం  పరిమితం ,ఆలోచనలు  అపరిమితం ,అన్నిటి  సమన్వయమే   అనుభవం !సానుకూల  ఆలోచన ,కావాలంటే  ముందుగా  ఆలోచనా  సరళి  వివేకం  నించి  వివేచనలో  సాగాలి . ప్రతి  క్షణాన్ని  అపురూపంగా  ఆస్వాదిస్తూ  నలుగురితో  భావాలు  పంచుకుంటూ  మనల్ని  మనం  మోటివేట్  చేసుకోవాలి . ముఖ్యంగా  భాద్యతలు  ముగిసి  ,పిల్లలందరూ  వారి  వారి  పథంలో  సాగుతున్నప్పుడు   మధ్య  మధ్య  మంచిచెడు  చెప్పి  సక్రమంగా  పయనించేలా  చూడాలి . జీవితం లో మనకంటూ  ఒక  సమయం  వుండాలి . వయసులో  వున్నప్పుడు  చదువు  ఆటలు  స్నేహితులు  యెంతో
వేగంగా  కాలం  కదిలి  పోతుంది .  ఆ  పిదప  మగపిల్లలైతే  వుద్యోగం ,పెళ్లి ,బాధ్యతలు ,పిల్లలు ,వాళ్ల  చదువులు యిలా  కాలం  కదిలి పోతుంది . ఆడపిల్లలైతే  పెళ్లి ,భర్త ,అత్తవారిల్లు ,బాధ్యతలు ,పిల్లలు  చదువులు  కాలం  యిలా
కదిలి పోతుంది . మరి  తనల్ని  గురించి  యెప్పు డు  ఆలోచించాలి ?ప్రతి వారికి  వ్యక్తిగత ఇష్టాలు  భావాలు  వుంటాయి . జీవన సంధ్యలో తను  కోరుకున్న  విధంగా  మలుచుకోవాలి . పిల్లల  మీద  ఆధార పడకుండా
ఆర్ధికంగా  నిలదొక్కుకొని  తామరాకు  మీద  నీటి బొట్టులా  జీవితం  గడపాలి . మన  చుట్టూ  వున్న  పృకృతి
యెన్నో  కథలు  చెపుతుంది . మనసుతో  వింటే  యెన్నో  భావాలు ! మన ఆలోచనలు  నలుగురితో  పంచుకోవాలి . ఎదుటి  వారి  ఆలోచనలకూ  అవకాశం  యివ్వాలి .అంతే  కానీ  మనల్ని  వాళ్లు  సరిగా  చూడలేదు ,వీళ్లు  సరిగా  చూడలేదు  అని  బాధ  పడకూడదు .,మన  ఆరోగ్యం  కాపాడుకుంటూ  యెవరి  మీద  ఆధార  పడకుండా  జీవితం
సాగించాలి !     
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 12:39 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: పోస్ట్‌లు (Atom)

నా గురించి

rajyalakshmi
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి

బ్లాగు ఆర్కైవ్

  • ►  2020 (1)
    • ►  నవంబర్ (1)
  • ►  2018 (1)
    • ►  ఏప్రిల్ (1)
  • ►  2017 (13)
    • ►  అక్టోబర్ (1)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  జూన్ (1)
    • ►  మే (4)
    • ►  మార్చి (4)
    • ►  ఫిబ్రవరి (1)
  • ▼  2016 (24)
    • ▼  డిసెంబర్ (1)
      • కలల అలలపై  తేలే సరసిజ  నీవైతే ,                  ...
    • ►  అక్టోబర్ (3)
      • ప్రేమంటే  అర్ధమే  తెలియని  లేతబాల్యం లో ,        ...
      • తరువులన్నీ యిచ్చిన చిన్ని  చిన్ని  విత్తనాలను  తె...
      •            మంచు  కురిసిన  రాతిరి  మనసున  కలవరింత ...
    • ►  జులై (9)
      • గ్రీష్మం  లో  ప్రకృతి  కాంత కందిపోయెనమ్మ ,తపనతో త...
      • గ్రీష్మం  లో  ప్రకృతి  కాంత కందిపోయెనమ్మ ,తపనతో త...
      • భారతీయుల  దాస్య  సంకెలలను  తెంప అవతరించిన  మహనీయు...
      • తెలుగు  తేజం  జాతీయ  తేజమై  ప్రభవించిన  రోజు !   ...
      • 10th  క్లాస్  వరకు  పిల్లలు  కేవలం  టీచర్  చెప్పి...
      • 10th  క్లాస్  వరకు  పిల్లలు  కేవలం  టీచర్  చెప్పి...
      •  మన  విద్య !!!!!!చదువు  కొంటున్నామా?కుంటున్నామా? ...
    • ►  జూన్ (1)
      • వేదాలు ఘోషించిన పవిత్ర కర్మ భూమి !  విమల చరిత కలి...
    • ►  మార్చి (5)
      • Alas  This is not what I thought life was I knew ...
      • వేయిపడగలు  -- 4వ  అధ్యాయము -- గత  3అధ్యాయాలు  గతవ...
      • వేయి  పడగలు ! మూడవ  అధ్యాయములో  కవి  గారు   గిరిక...
      • మన వెల లేని గతం ఈ నాడు విల విల లాడుతున్నది
      • వేయిపడగలు  తొలి  రెండు  అధ్యాయాలలో  ప్రాముఖ్యత  గ...
    • ►  ఫిబ్రవరి (5)
      • మరణం
      • ఆణిముత్యాలు
      • వేయిపడగలు నా అనుభూతి
      • వేయి పడగలు మరపురాని అనుభూతి
      • మలి వయసు మనది
  • ►  2015 (21)
    • ►  డిసెంబర్ (4)
    • ►  నవంబర్ (1)
    • ►  అక్టోబర్ (5)
    • ►  సెప్టెంబర్ (6)
    • ►  ఆగస్టు (5)
వాటర్‌మార్క్ థీమ్. Blogger ఆధారితం.