నాకు నచ్చిన కొన్న్ని ఆణిముత్యాలు ,వేయిపడగలు
అందమైన పదాల పొందికలో ,కల్పనా శైలి లో ఈ నాటికి యెవరు సాటి రారు !
నేను మెచ్చిన మచ్చు తునుకలు భావి రచనా పరిచయాన్ని మనం అందుకుంటే ఈ క్రింది వాక్యాలలో చూడవచ్చును ,
"వేసంగి మండుటెండలు లేత రావిఅకుల మీద పడి ధగ ధగ లాడి కదలినపుడు ,త ళ త ళ మెరయు గోధుమ వన్నె త్రాచుల పడగలవలె ప్రకా శించు చుండెను . రావి యాకుల చిన్ని చిన్ని తోకలు ,చాచిన నాల్కలవలె తోచెను . దూరమున ఆకాశములో తెల్లని సన్నని మబ్బులు పలుచనై చెర లాడి -తెల్లత్రాచులు మసక లాడినట్లు ,పడగలు విప్పినట్లు ,ఒకదానిపై యొకడు దూకి కరచుకొన్నట్లు ,,పరవళ్ళు తొక్కినట్లు నానా రీతుల
గోచరించెను ,ఎండ యేమో కస టె క్కి మహభుజంగమొకడు కుపితమై బుస్సుమని పడగ విప్పి తోక మీద లేచి నిలచినట్లు ,దుర్నిరీక్ష్యమైపోయెను '
ఈ పదాల పొందికలో తొలి సంధ్య నుండి మలి సం ధ్య దాకా అన్ని గోచరమవుతాయి .
ఆలయంలోని వేణు గోపాలుని వర్ణన
'స్వామి విగ్రహం మనిసి యంత యెత్తు కలది . నిత్యము నర్చకుడు రాయుచున్న నూనె చేత తడిసి మైమరు వె డ మిచ్చిన తావుల స్వామి శరీరము ప్రా వృ షే ణ్య నీ ల జలద స్నిగ్ధ చ్చాయా ముగ్ధమై క్రొత్త కాటుక కాంతులు విరియ జల్లు చుండెను ,స్వామి ముఖ కమలమున అంటించిన రజత మాణిక్య మయమైన ఊర్ధ్వ
పుండ్ర ములు గోలోక ద్వారము వలె ,స్వామి వంక బొమలు ముడిచి పరిహాసముగా చూచుచున్న రాదికాదేవి ద్విభ్రూమధ్యగత త్రిరేఖా కృతి భక్తలోక మనః ఆహ్లాదిని యయ్యెను ,వ్యత్యస్త పాదార విం దుడై వేణువు వాయించుచున్నట్లు చేయించిన దా మూర్తి !ప్రక్కను సత్యభామా దేవి -శృ గారమయ మూర్తి !కుడిచేత విలాస
కమలము ధరించి పొందికగా స్వామి నత్తుకొని యుండెను!భగవంతుడిని అందరము చూస్తాము కానీ వర్ణన
ఆయనకే సాధ్యము !ఆ మహనీయునికి నా వందనాలు
వేయిపడగలు మన యింట్లో వుంటే భావ దరిద్రం మనకు ఉండదుగా !
అందమైన పదాల పొందికలో ,కల్పనా శైలి లో ఈ నాటికి యెవరు సాటి రారు !
నేను మెచ్చిన మచ్చు తునుకలు భావి రచనా పరిచయాన్ని మనం అందుకుంటే ఈ క్రింది వాక్యాలలో చూడవచ్చును ,
"వేసంగి మండుటెండలు లేత రావిఅకుల మీద పడి ధగ ధగ లాడి కదలినపుడు ,త ళ త ళ మెరయు గోధుమ వన్నె త్రాచుల పడగలవలె ప్రకా శించు చుండెను . రావి యాకుల చిన్ని చిన్ని తోకలు ,చాచిన నాల్కలవలె తోచెను . దూరమున ఆకాశములో తెల్లని సన్నని మబ్బులు పలుచనై చెర లాడి -తెల్లత్రాచులు మసక లాడినట్లు ,పడగలు విప్పినట్లు ,ఒకదానిపై యొకడు దూకి కరచుకొన్నట్లు ,,పరవళ్ళు తొక్కినట్లు నానా రీతుల
గోచరించెను ,ఎండ యేమో కస టె క్కి మహభుజంగమొకడు కుపితమై బుస్సుమని పడగ విప్పి తోక మీద లేచి నిలచినట్లు ,దుర్నిరీక్ష్యమైపోయెను '
ఈ పదాల పొందికలో తొలి సంధ్య నుండి మలి సం ధ్య దాకా అన్ని గోచరమవుతాయి .
ఆలయంలోని వేణు గోపాలుని వర్ణన
'స్వామి విగ్రహం మనిసి యంత యెత్తు కలది . నిత్యము నర్చకుడు రాయుచున్న నూనె చేత తడిసి మైమరు వె డ మిచ్చిన తావుల స్వామి శరీరము ప్రా వృ షే ణ్య నీ ల జలద స్నిగ్ధ చ్చాయా ముగ్ధమై క్రొత్త కాటుక కాంతులు విరియ జల్లు చుండెను ,స్వామి ముఖ కమలమున అంటించిన రజత మాణిక్య మయమైన ఊర్ధ్వ
పుండ్ర ములు గోలోక ద్వారము వలె ,స్వామి వంక బొమలు ముడిచి పరిహాసముగా చూచుచున్న రాదికాదేవి ద్విభ్రూమధ్యగత త్రిరేఖా కృతి భక్తలోక మనః ఆహ్లాదిని యయ్యెను ,వ్యత్యస్త పాదార విం దుడై వేణువు వాయించుచున్నట్లు చేయించిన దా మూర్తి !ప్రక్కను సత్యభామా దేవి -శృ గారమయ మూర్తి !కుడిచేత విలాస
కమలము ధరించి పొందికగా స్వామి నత్తుకొని యుండెను!భగవంతుడిని అందరము చూస్తాము కానీ వర్ణన
ఆయనకే సాధ్యము !ఆ మహనీయునికి నా వందనాలు
వేయిపడగలు మన యింట్లో వుంటే భావ దరిద్రం మనకు ఉండదుగా !
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి