2, అక్టోబర్ 2017, సోమవారం

ఈమధ్య  కాలంలో  నన్ను  ప్రభావితం  చేసిన  పుస్తకం  'ఏడు  తరాలు ' ఆంగ్లం లో  హేల్లెక్స్  గారు 'ది రూట్స్ ' పేరిట  తన  అనుభవాలను  వ్రాసారు ! సహవాసి  గారు  తెలుగు లోఅనువదించారు !ఆంగ్లమూలం  చెడకుండా  భావాలను
   తెలిపారు !                                                                                                                                         
 నాగరికత  నవసమాజం  కేవలం  ఒకరి  సొత్తుకాదు !మానవ ఇతిహాసం  లో  కొన్ని నగ్నసత్యాలు  సకల మానవాళికి      తెలిసిననాడు  ప్రతి ఒక్కరూ  స్పందించి తీరుతారు !మనసులోతులో   కల్లోల అలలు  యెగసిపడక తప్పదు !ప్రస్తుత     
సమాజం  లో  మనం  యాంత్రిక జీవనం  లో మనబంధువులను, కన్న తల్లితండ్రులను ,అసలు  యెవ్వరి గురించి       
ఆలోచించం !కనీసం  ప్రయత్నం  కూడా  చెయ్యం ! అలాంటిది  ఒక వ్యక్తి  ఏడుతరాల  క్రిందటి  తనమూలాలను వెదుక్కుంటూ  యెంతో లోతుగా  పరిశీలన  చేస్తూ  తాను  అనుకున్న  గమ్యానికి  చేరడం  చాలా గొప్పవిషయం              !శతాబ్దాల కిందటే  ఆఫ్రికా  మారుమూల  గ్రామాల్లో  పరిపాలనా వ్యవస్థ  వున్నదని నిర్బంధ  విద్య  వున్నదని తెలిసి        విస్తుపోయాను !ఏడుతరాల  బానిస  యదార్థ  విషయాలు  చదువుతుంటే  మనసంతా  మూగపోతుంది !తెల్లవాళ్లు     
దాతలుగా  నల్లవాళ్ళు  గ్రహీతలుగా  వుండే  వ్యవస్థ  పోయి  సమాన భాగస్వాములుగా  వుండే  సామాజిక వ్యవస్థకోసం నల్లజాతివారి  తపన  ఆరాటం  మనో  భావ  సంచలనం   'ఎదుతరాలు ' ప్రతిధ్వనిస్తాయి !                                 
రెండు ఖండాలు , రెండు జాతులు ,రెండు  శతాబ్దాల  యదార్ధ  వ్యధా  చరిత్ర !రచయిత  వాషిగ్టన్  ప్రాచీన  పాత్రభండాగారం  వెళ్లి  తనవారి  పేర్లు   వెతుక్కుని  ఆఫ్రికా భాష  మాండింకా తెలిసిన  వారిని  కలవడం  చాలా  గొప్ప విషయం !గాంబియా  వెళ్లి  తాతముత్తాతలు  పుట్టిన  గ్రామం  జాపూరును  దర్శించడం ,బానిస బతుకుల  వ్యధను
పుస్తకరూపం లో వ్రాయడం  నిజం గా మానవాళి  గర్వించ గల  విషయం !మూడు ఖండాలు  తిరిగి  ప్రాచీన  పత్ర భాండాగారంలో  విషయాలు  సేకరించి  సమకాలీన  ఆఫ్రికా  జీవన సరళి   ప్రతిబింబమే  'ఏడు తరాలు ' మన పాఠకులు అందరూ వీలైతే  తప్పకుండా చదవడానికి  ప్రయత్నించండి !