3, మార్చి 2016, గురువారం

వేయిపడగలు  తొలి  రెండు  అధ్యాయాలలో  ప్రాముఖ్యత  గల  పాత్రలు  ---రామేశ్వర శాస్త్రి ,కృష్ణమనాయుడు ,వారి  ఆప్యాయతలు  మరియు  స్నేహబంధం !తొలుతగా  నా  దృష్టి  లో ,
రామేశ్వర శాస్త్రిగారు ---ఈయన  సుబ్బన్న పేటలో  5వ  తరానికి  చెందిన  వ్యక్తి -సుందర రూపి ,ఔదార్యులు ,పాండిత్య ప్రతిభ  కలవారు .నాలుగు  వర్ణముల  వారిని  పెళ్లి  చేసుకున్నారు ,అంతే  కాక  రత్నగిరి  అనే  భోగంగాన ను  చెరదీసా రు . అయన లోని  యితర  సుగుణముల  వలన ,ఆయన  చేసుకున్న  వివాహముల
విషయాలు  మరుగున  పడుతాయి . అలాగే  భార్యల  పట్ల  అయన  ప్రవర్తించిన  తీరు  కూడా  చాలా  హుందాగా
వున్నది . తనకున్న  ధనం  అందరి  అవసరాలకు  వాడుతారు  ,నిరతాన్న దాత !ప్రజాక్షేమం  కోరే  వ్యక్తిగా  అందరి  మన్ననలు  పొందుతారు . ఆలయంలో ధ్వజస్తంభానికి  బంగారపు  తొడుగు  వేయించడం ,సత్యభామాదేవికి  మాణిక్యము  పొదిగిన  అడ్డబాస  చేయించడం .ఈ  పనులన్నీ శాస్త్రి  గారి  లలితభావ  జలాన్ని  కళ్ళముందు  నిలబెట్టుతాయి ,కొన్ని  కొన్ని  సంఘటనలను  చదువుతుంటే    విశ్వ నాధులే  కళ్ళ  ముందు  నిలుస్తారు .
ఇల్లు  గడవని  రోజులలో  కూడా  వితరణ  గుణం  మనల్ని  కట్టి  పడేస్తుంది ,రామేశ్వర  శాస్త్రి  పాత్ర  సజీవ  పాత్ర
కృష్ణమనాయుడు -రాజు ,పురోహితులు  వ్యవస్థను  సక్రమంగా  నడిపినప్పుడే  సమాజం  వర్ధిల్లుతుంది .
నాయుడు గారు ,శాస్త్రిగారు ఆత్మ గౌరవాన్ని  కాపాడుకుంటూ  స్నేహబంధాన్ని  నిలుపుకుంటారు . వారి  మనసులు  మాట్లాడుకుంటాయి ,నాయుడుగారు  శాస్త్రిగారి  అప్పులన్నీ  చాలా  చాకచక్యంగా  తీర్చి  ధర్మారావుని  ఆదరించిన  తీరు  వర్ణ నాతీతమ్ !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి