16, సెప్టెంబర్ 2015, బుధవారం

సాయినాథుడే సకలం

సాయి నాథుని  లీలలు  సకల  జనులకు  సంపదలు ,
అందరిలో  నిండిన  అనంతుడే  మన  సాయి నాథుడు ,
బాబా  కరుణా  కటాక్షాలే  కావాలి  మనకు  నిరంతరం ,
ఆ  చల్లని  చూపుల  కాంతులలో  కావాలి  అణువణువు
పవిత్రం ,బాబా  నడయాడిన  షిరిడిలో   పుణ్యమెంత
చేసెనో కద  ఆ  పవిత్ర ధూళి !

11, సెప్టెంబర్ 2015, శుక్రవారం

సేమ్యాతొ స్నాక్స్

దోశె -సేమ్యా 2కప్పులు ,బొంబాయి  రవ్వ 1కప్పు ,బియ్యప్పిండి 1కప్పు ,పుల్లమజ్జిగ 1కప్పు జీలకర్ర 1స్పూన్ ,ఉప్పు  తగినంత ,నూనె -ఒకగిన్నెలో ఇవన్నీ  కలిపి 1గంట  నానబెట్టి  దోశెలు  వేసుకోవాలి
సేమ్యాలడ్డు -సేమ్యా  చిన్న  చిన్న  ముక్కలు  చేసుకోవాలి ,కోవా 150గ్రాములు ,పంచదార 1/2కప్పు ,నెయ్యి 4స్పూన్లు ,యాలకులపొడి 1/2స్పూన్ ,dryfruits 50గ్రాములు -ఒక  గిన్నెలో పంచదార,dryfruits ,యాలకులపొడి
కోవా  తీసుకుని  బాగా  కలపాలి బాణలిలో  నెయ్యి వేడి  చేసి  సేమ్యాముక్కలను  ఎర్రగా  వేయించాలి . ఇందాక  కలిపిన  ముద్దను సేమ్యాముక్కలలో  కలపాలి 3నిమిషాలు  సెగ  మీద  వుంచి  తీసేయ్యాలి . వేడి  కొద్దిగా  తగ్గాక .
 వుండలు  కట్టాలి
సెమ్యవద -ఉడికించిన  ఒక  కప్పు  సేమ్యాలో 1/2కప్పు  మైదా ,1/2కప్పు  బొంబాయి  రవ్వ ,ఉల్లిపాయ  తరుగు 1కప్పు 2పచ్చిమిర్చి ,చిన్న అల్లం  ముక్క ,కొద్దిగా  జీలకర్ర ,కొన్ని  పల్లీలు ,వుప్పు  తగినంత  కలపాలి .తర్వాత
వడలాగా  ఒత్తుకుని  నూనెలొ  వేయించుకోవాలి
బియ్యం  చెక్కలు -బియ్యం 3కప్పులు ,పెసరపప్పు 1కప్పు ,సగ్గుబియ్యం 1/2కప్పు నువ్వులు 2స్పూన్లు ,జీలకర్ర 1స్పూన్ ,వెన్న 1స్పూన్ ,కారం ,వుప్పు  తగినంత -బియ్యం ,పెసరపప్పు ,సగ్గ్గుబియ్యం  విడివిడిగా  2గంటలు
నానబెట్టుకోవాలి .  మెత్తగా  పిండి  చేసుకోవాలి . అందులో  నువ్వులు ,జీలకర్ర ,వెన్న ,వుప్పు  కారం  వేసి  చపాతీ
ముద్దలా  కలపాలి . కొద్దిసేపు  తర్వాత  చిన్న  చెక్కల్లా  ఒత్తుకుని  నూనెలో  వేయించు కోవాలి . .     

10, సెప్టెంబర్ 2015, గురువారం

రకరకాల రుచులు

దహీపూరి -2 బంగాళా దుంపలు ,శెనగలు 1/2కప్పు ,పెసలు 1/2కప్పు ,ఆకుపచ్చ బఠాని 1/2కప్పు ,అల్లంవెల్లుల్లి  ముద్ద 1/4స్పూన్ ,జీలకర్రపొడి 1/2స్పూన్ ,కారం 1/2స్పూన్ ,ఉప్పు  తగినంత కావాలి .
శెనగలు ,పెసలు ,బఠాని  కలిపి  గంటసేపు  నానపెట్టాలి .  తర్వాత  కుక్కర్లో  పెట్టి  మెత్తగా  వుడికించాలి .   దీనికి
అల్లంవెల్లుల్లి  ముద్దను ,కారం ,జీలకర్రపొడి ,వుప్పు  కలపాలి . అప్పుడు  మనం  చేసిన  పూరి  తీసుకుని  మధ్యలో
చిన్నగా  గుంటలాగా  నొక్కాలి . అందులో  ఈ  కలిపిన  ముద్దను  పెట్టాలి . దినిమీద  దహి  చట్నీ  పోసుకోవాలి ,చిటి కెడు  చాట్  మసాలా  చల్లుకోవాలి . దహిపురీ  తయ్యార్ .
దహీచట్ని -పెరుగు 1కప్పు ,కొబ్బరిపొడి 2స్పూన్లు ,పంచదార  2స్పూన్లు ,పండుమిర్చిముద్ద 1స్పూన్ ,నల్లవుప్పు
చిటి కెడు  వుప్పు  తగినంత . పెరుగులో  యివన్నీ  కలుపుకోవాలి . దాహిచట్ని  తయ్యార్ .
పానీపురి -తగినన్ని  పూరీలు ,ఆకుపచ్చ  బఠాని 1కప్పు ,బంగాళా దుంప 1,చింతపండు  గుజ్జు 1స్పూన్ ,కారం 1స్పూన్ ,చాట్ మసాలా 1/2స్పూన్ ,కొత్తిమీర 1కట్ట ,వుప్పు  తగినంత . బఠానీ ,ఆలు  మెత్తగా  వుడికించాలి .
ఈ  ముద్దకు  వుప్పు ,చాట్ మసాలా ,కొత్తిమీర కలిపి  వుంచుకోవాలి . ఒక  గ్లాసు  నీళ్ళు  తీసుకుని చింతపండు
గుజ్జు ,కారం ,వుప్పు  కలుపుకోవాలి . ఇప్పుడు  పూరీని  మధ్యలో  గుంట  నొక్కుకుని  అందులో  ఆలూ బఠానీ  మద్దను పెట్టి  రెడీగా  వున్న చితపండు  నీళ్ళల్లో  ముంచి  తినాలి .
సగ్గుబియ్యం వడ -సగ్గుబియ్యం 1కప్పు ,వుడికించి తొక్కు తీసిన  బంగాళా దుంప 1,వేయించిన కచ్చాపచ్చాగా
దంచిన  పల్లీన్లో /2కప్పు ,చీల్చిన  పఛిమిర్చి 2,జీలకర్ర 1స్పూన్ ,కొత్తిమీరతురుము 2స్పూన్లు వుప్పు  తగినంత
నూనె  వేయించడానికి  తగినంత . సగ్గుబియ్యం 3సార్లు  కడగాలి . నీళ్ళుపోసి  6గంటలు  నానపెట్టాలి . బాగా
నానిన  ముద్దకు  మిగిలినవి  అన్నీ  కలిపి  మెత్తగా  ముద్ద  చెయ్యాలి చిన్న  చిన్న  గారెలుగా  చేసి నూనెలోaవేయించుకోవాలి .సగ్గుబియ్యమ్  వడలు  తయ్యార్
సెనగపిండి  బర్ఫీ -సెనగపిండి 1కప్పు ,నెయ్యి 1కప్పు ,పాలపొడి 1కప్పు ,పంచదార ఒకటిన్నర కప్పు ,నీళ్ళు
2కప్పులు -బాణలిలో  నెయ్యి  కరిగించి  పచ్చి  వాసన  పోయేదాకా  సెనగపిండి  వేయించుకోవాలి . గిన్నెలో
తీసుకుని  పాలపొడి  వేసి  బాగా  కలపాలి ఒకగిన్నెలో  నీళ్ళు  పంచదార  తీసుకుని  సన్నని  మంట తో  వుండ  పాకం  రానివ్వాలి దాన్లో  సెనగపిండి  మిశ్రమం  కలపాలి  దగ్గరగా  వచ్చేదాకా  సన్న  సెగ  మీద  వుంచి  దించెయ్యాలి వేడి  చల్లారాకా  బిళ్లలుగా  కోసుకోవాలి

9, సెప్టెంబర్ 2015, బుధవారం

కావలసిన పొషకాలు

మన  శరీరానికి  అన్ని  పోషకాలు  కావాలి  ఏది  తగ్గినా  సమస్యే /
vitaminA -పాలు ,కారట్ ,క్యాబేజీ ,ఆకుకూరలు ,వెన్న ,మీగడ ,టమాటో , వాడాలి . చర్మవ్యాధులు  రావు .  కంటిచూపు  కాపాడుతుంది .
vitaminB - ఇది  8విటమిన్ల  కలయిక . ధాన్యం ,ఆకుకూరలు ,యీస్ట్ ,. నాడి  వ్యవస్థ  బలపడుతుంది .
vitaminC -టమాటో ,కాబేజీ ,ఎండుమిరప ,కాలిఫ్లవర్ ,స్టాబెరి . శరీరంలోని  టిష్యు లను  బలంగా  ఉంచుతుంది .
మానసిక  రుగ్మతనుండి  కాపాడుతుంది .  దంతాలు  గట్టి  పడతాయి అలసట  దూరం  చేస్తుంది .
vitaminD -సూర్యరశ్మిలో  బాగా  వుంటుంది .  రోజు కాసేపు  ఎండలో  కూర్చోవాలి . ఎముకలు  గట్టి  పడ్తాయి
vitaminE -కారట్ ,క్యాబేజీ ,ఆలివ్ ఆయిల్  చపాతీ ,ఆకుకూరలు ,జీడిపప్పు . రక్తప్రసరణ  బాగా  జరుగుతుంది .
vitaminK -ఆకుకూరలు . రక్తం  గడ్డ  కట్టకుండా  ఆపుతుంది
vitaminC -సిట్రస్  పళ్ళల్లో  అధికం . రక్తకణాలు  పెరుగుతాయి . ఉసిరి ,టమాటో ,బ్రకోలి ,నిమ్మ  బత్తాయి .
బాదం ,వాల్ నట్స్ ,కాల్షియం  ఇస్తాయి .
పాలు ,తృణధాన్యాలు ,సోయా ,లో  కాల్షియం  వుంటుంది . .విటమిన్ 12 లోపంతో  రక్తహినత  ఏర్పడుతుంది .
బరువు  తగ్గుతారు  పాలు  బాగా  తాగాలి . B 12మాత్రలు  వాడాలి .
B 9-ఫోలిక్ యాసిడ్ -ఇది  గుండె  రక్షణకు  అవసరం ఆకుకూరలు ,పుల్లటి పళ్ళు ,గింజపప్పులొ  కలదు

  

ఆరోగ్యాని కి జాగ్రత్తలు

పుట్టుక  మనచేతిలో  లేదు .  కానీ  ఆ  జీవితాన్ని  మలుచు  కోవడం  మన  చేతిలో  వుంది .  మానసికంగా    ఆరోగ్యంగా  ఉండాలి .అలాగే  మన  శరీరం  కూడా  ఆరోగ్యంగా  వుండాలి . నాకు  తెలిసిన  కొన్ని   విషయాలు
వ్రాస్తున్నాను .
మెంతులు  ఆకలిని  కలిగిస్తాయి . ఒక్కోసారి  మనకు  తినాలనే  ధ్యాసే  వుండదు . అప్పుడు మెంతి  పొడిని మొదటి  ముద్దలో  తింటే  ఆకలి  పుట్టి  యితర  అధరువులను  కలుపుకోవాలనిపిస్తుంది .
మెంతులు   శరీరంలో  అన్ని  భాగాలకు  శక్తి  యిస్తాయి .
మెంతి  ఆకు  మెత్తగా  నూరి   కొద్దిగా  నెయ్యి  కలిపివుడికించి  ఎంత  పెద్ద  గడ్డ  పైన  వేసి  కట్టినా   గడ్డ  పగులు  తుంది .
మెంతియాకు  మెత్తగా  నూరి  పెరుగుతో  కలిపి  తలకు  పట్టించుకుని  ఆరిన  తర్వాత  తల  స్నానం  చేస్తే  జుట్టు  పెరుగుతుంది .
రోజూ   వుదయాన్నె   పళ్ళు  తోముకున్న  తర్వాత  లేత  వేపచిగురు  తింటే  పొట్టలో  పురుగులు  నశిస్తాయి .
కొవ్వు  కరగాలంటే  పొద్దున్నే  ఒకగ్లాసు  నిమ్మరసం  గోరువెచ్చని  నీళ్ళల్లో  కలుపుకుని  తాగాలి .
అల్లం  ముక్కలు  నీళ్ళల్లో  బాగా  మరిగించి   వడ  కట్టి  కొద్దిగా  తేనె  కలుపుకొని  తాగితే  జీర్ణ వ్యవస్థ  బాగుంటుంది .
ఉదయాన్నే  వెల్లుల్లి  రెబ్బలు  కొన్ని   నిమ్మరసంతో  కలిపి  తీసుకుంటే  రక్తప్రసరణ  బాగుంటుంది .
రాత్రి  2 లేక  3బాదం  పప్పులు  నానబెట్టి  పొద్దున్నే  పొట్టు  తీసి  తింటే  పొట్ట  చుట్టూ  పేరుకున్న కొవ్వు  తగ్గుతుంది .
కలబంద   రసంలో  ధనియా  పొడి  వేసుకుని  తాగితే  పొట్ట  చుట్టూ  వున్న కొవ్వు  తగ్గుతుంది .
ప్రతిరోజూ  ఒక  అరటిచేస్తూ పండు  తింటే  రక్తపోటును  నివారించవచ్చును .
ఆహారంలో  పాలకూర  వాడడం  వల్ల  కూడా  రక్తపోటు  control  చెయ్యచ్చు
నారింజరసం   high  B  P  CONTROL  చేస్తుంది .
జుట్టు  రాలకుండా  వుండాలంటే  ఆలివ్  నూనెలో  రెండు  చుక్కల  నిమ్మరసం  వేసి  తలకు  బాగా  మర్దన  చెయ్యాలి
. \ బాగా  యింకిన  తర్వాత కుంకుడు  రసంతో  తల  కడుక్కోవాలి .
కరివేపాకును  బాగా  మెత్తటి ముద్ద  చేసి  కొద్ద్దిగా  కలబంద  గుజ్జు  కలిపి జుట్టుకు  రాసుకుని  ఆరిన  తర్వాత
తలరుద్దుకోవాలి .  జుట్టు  నల్లగా  వస్తుంది .
కరివేపాకు  ముద్దలో  కొద్దిగా  ఆలివ్  నూనె  కలిపి  తలకు  రాసుకుని  గంట  తర్వాత  స్నానం  చెయ్యాలి . ఇలా
వారంలో  రెండుసార్లు  చేస్తూ  వుంటే  చుండ్రు  పోతుంది
కొబ్బరినూనెలొ   కొన్ని  కరివేపాకులు  వేసి  బాగా  వేడి  చేసి  వడ  కట్టాలి .  ఈ  నూనె  రోజూ  రాసుకుంటే జుట్టు
వూదదు
దగ్గు  తగ్గాలంటే  మిరియాల  చూర్ణం నెయ్యి  చక్కెర కలిపి  ఒక  టీ  స్పూన  కొన్ని  రోజులు  తీసుకుంటే  దగ్గు
తగ్గుతుంది
  .


5, సెప్టెంబర్ 2015, శనివారం

character building

A man may die,but his character remains. His thoughts remains. It is the  character that gives real force and power to man. Character is power. They say,[Knowledge is power,] but in my view[Character is power.] Without character the  attainment of knowledge is impossible. If we want
success in life ,if we want to influence others, if we want progress well in the  spiritual  path and if we  wish to have God realisation we must possess spotless  character.The noble people like Sankara,
Buddha, and great saints influenced us with theireverlasting character. The character is  the  outcome
of our thoughts.,ideas.If we change our thoughts character also changes.Building up of character is building up of habits.  The change of character is the change of habits. Habit is second nature.Character is first nature. Character  will help us to attain the goal of life.