11, సెప్టెంబర్ 2015, శుక్రవారం

సేమ్యాతొ స్నాక్స్

దోశె -సేమ్యా 2కప్పులు ,బొంబాయి  రవ్వ 1కప్పు ,బియ్యప్పిండి 1కప్పు ,పుల్లమజ్జిగ 1కప్పు జీలకర్ర 1స్పూన్ ,ఉప్పు  తగినంత ,నూనె -ఒకగిన్నెలో ఇవన్నీ  కలిపి 1గంట  నానబెట్టి  దోశెలు  వేసుకోవాలి
సేమ్యాలడ్డు -సేమ్యా  చిన్న  చిన్న  ముక్కలు  చేసుకోవాలి ,కోవా 150గ్రాములు ,పంచదార 1/2కప్పు ,నెయ్యి 4స్పూన్లు ,యాలకులపొడి 1/2స్పూన్ ,dryfruits 50గ్రాములు -ఒక  గిన్నెలో పంచదార,dryfruits ,యాలకులపొడి
కోవా  తీసుకుని  బాగా  కలపాలి బాణలిలో  నెయ్యి వేడి  చేసి  సేమ్యాముక్కలను  ఎర్రగా  వేయించాలి . ఇందాక  కలిపిన  ముద్దను సేమ్యాముక్కలలో  కలపాలి 3నిమిషాలు  సెగ  మీద  వుంచి  తీసేయ్యాలి . వేడి  కొద్దిగా  తగ్గాక .
 వుండలు  కట్టాలి
సెమ్యవద -ఉడికించిన  ఒక  కప్పు  సేమ్యాలో 1/2కప్పు  మైదా ,1/2కప్పు  బొంబాయి  రవ్వ ,ఉల్లిపాయ  తరుగు 1కప్పు 2పచ్చిమిర్చి ,చిన్న అల్లం  ముక్క ,కొద్దిగా  జీలకర్ర ,కొన్ని  పల్లీలు ,వుప్పు  తగినంత  కలపాలి .తర్వాత
వడలాగా  ఒత్తుకుని  నూనెలొ  వేయించుకోవాలి
బియ్యం  చెక్కలు -బియ్యం 3కప్పులు ,పెసరపప్పు 1కప్పు ,సగ్గుబియ్యం 1/2కప్పు నువ్వులు 2స్పూన్లు ,జీలకర్ర 1స్పూన్ ,వెన్న 1స్పూన్ ,కారం ,వుప్పు  తగినంత -బియ్యం ,పెసరపప్పు ,సగ్గ్గుబియ్యం  విడివిడిగా  2గంటలు
నానబెట్టుకోవాలి .  మెత్తగా  పిండి  చేసుకోవాలి . అందులో  నువ్వులు ,జీలకర్ర ,వెన్న ,వుప్పు  కారం  వేసి  చపాతీ
ముద్దలా  కలపాలి . కొద్దిసేపు  తర్వాత  చిన్న  చెక్కల్లా  ఒత్తుకుని  నూనెలో  వేయించు కోవాలి . .     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి