12, ఆగస్టు 2015, బుధవారం

simple man with noble thoughts

మన  పంచమ  వేదం  మహాభారతం  భారతీయుల  జీవనాడి . భీష్మపితామహుని విష్ణుసహస్రనామం  మన  నిత్యపారయణమ్ . ఈనాటి  వర్తమాన  మహాభారతంలో  శ్రి  గౌరవరతుల్యులు  A  P  J  అబ్దుల్  కలాం  గారి సూక్తులు  ప్రతి  భారతియుడు  నిత్యం  మననం  చెయ్యాలి . 27 /7/2015    ఆయన   ఆత్మ  మరో  లొకానికి  పయనమైంది . కాని  మేము ఏం  కావాలి?అశ్రు  నయనాలతో  నా  తర్పణ స్వీకరించు మహాత్మా . ఆ  అమరజీవి  అమూల్య  సూక్తులు కొన్ని వ్రాసుకున్నాను .
'కష్టాలు  నిన్ను  నాశనం  చేయడానికి  కాదు ,నీలొని  సమర్ధతను  వెలికి  తీసి నిన్ను  నువ్వు న
     ని రూపించుకోవడానికీ  వస్తాయి .కష్టాలు  కూడా  బిత్తర  పోవాలి  నిన్ను  కష్టపెట్టడం  చాలా  కష్టమని। '
2. జీవితం  ,సమయం -ఈ  రెండు  ప్రపంచానికి  అత్యుత్తమ  ఉపాధ్యాయులు .

3. మనస్పూర్తి గా  పనిచేయని వారు  జీవితం  లో విజయం సాధించలేరు .
4. అపజయం  తప్పటడుగు  కాదు  నిన్ను  నిన్నుగా  సరిదిద్దుకోవదానికి  వచ్చిన  చక్కని  అవకాశం .
5. కలలు  కనండి  ఆలోచనలకు  రెక్కలు  తొడగండి  ఆలోచనలే  ఆచరణకు  పునాది  అవుతుంది .
6. అలవాట్లు  సక్రమం  అయితే  భవిష్యత్తు  సక్రమం  అవుతుంది .
7.  నీకు  గుర్తింపు  రావాలంటే  నీ  సమర్ధత  పెంచుకో . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి