25, ఆగస్టు 2015, మంగళవారం

సేకరణ

గౌరవనీయులు ,పూజ్యులు ,మహానుభావులు ,శ్రీ ,ఎక్కిరాల  కృష్ణమాచార్య  గారు  రచించిన  శ్రీమద్భాగవత  ప్రకాశము  పంచమ  స్కందం  ద్వితీయ  భాగం  13 నందు అమూల్యమైన  కొన్ని   వివరాలను  అందరము వారు  తెలుసుకోవాలనే  తపనతో తెలియపరుస్తున్నాను , ఆచార్యులవారి  పాదాలకు  ప్రణమిల్లుతూ   వ్రాస్తున్నాను వారు  వ్రాసిన  వాక్యాలను  యథాతథంగా  వ్రాస్తున్నాను .
సూర్యుని  సంవత్సర  గమనము  నందు  ఉత్తరాయనము  దక్షిణాయనము  విఘవము  అను  గమనములు  వున్నవి వుత్తరాయనమున  పగలు  దీర్ఘముగా  రాత్రి . చిన్నగా  వుండును .  దక్షిణాయనము  రాత్రి  దీర్ఘముగా
పగలు  చిన్నగా  వుండును .  విఘవములందు  పగలు  రాత్రి  సమానముగా  వుండును .  ఏ  దినమునందు  మిక్కిలి  దీర్ఘమైన  రాత్రి  మిక్కిలి  చిన్నదైన  పగలు  వచ్చునో   ఆ  మరుసటి  దినమునుంది  ఉత్తరాయనము  ప్రారంభమగును .  పగలు  పెరిగి  రాత్రి  తగ్గుచుండును .  మూడు  మాసములలో  రాత్రి  పగలు  సమానముగా  వున్న  దినము  వచ్చును .  ఆ  నాటి  సూర్యోదయమును  విఘవము  అందురు .  అదియే  విఘవత్పుణ్య
కాలమందురు . ఆ  నాడు  సూర్యుడు  భూమధ్యరేఖను  దక్షిణము  నుండి  ఉత్తరము  నకు  దాటును .  అదియే
మేషరాశి  ప్రారంభము .ఆ  దినమునుంది  పగళ్ళు  పెరిగి  రాత్రుళ్ళు  చిన్నవగుచుండును .  మరల  మూడు
మాసములలో  అతి  దీర్ఘమైన  పగలు  అతి  చిన్నదైన  రాత్రి  గల  దినము  వచ్చును .   ఆ  మరునాటి  సూర్యోదయమునుంది  దక్షిణాయనం  ప్రారంభమగును  .దీనినే  కర్కాటక  రాశి  ప్రారంభం  అని  చెప్పవచ్చును.
ఆ  రోజునుండి  రాత్రులు  పెరుగుతూ  పగళ్ళు  చిన్నవిగా  అవుతూ  వుంటాయి .  మూడు  మాసముల  పిదప  రాత్రి  పగలు  సమానమైన  దినం  వస్తుంది .  దీనిని  దక్షిణ  విఘవం  అందురు .  ఆ  రోజు  నుండి  సూర్యుడు
తులా రాశి  లో  ప్రవేశిస్తాడు . ఆ  దినం  నుండి  పగలు  చిన్నగా  రాత్రి పెద్దదిగా  అవుతుంది . మరల  మూడు
మాసములలో   అతి  దీర్ఘమైన   రాత్రి  అతి  చిన్న  పగలు  గల  దినం  యేర్పడుతుంది . ఆ  మరుసటి  రోజు నుండి
ఉత్తరాయనం  ప్రారంభం  అవుతుంది .  దీనినే  మకర  రాశి  ప్రారంభం  అందురు . ఈ  లెక్కలన్నీ  లంకా  పట్టణ  ప్రదేశమున నిలబడి  గుణించి నప్పుడే  సరిగా  వచ్చును . లంక  అనగా  భూమధ్యరేఖ .  ఈ  విధంగా సంవత్సరమున  మూడేసి  నెలల  కొకటి  చొప్పున  నాలుగు  పాదములు  వచ్చును .ఇప్పటి  ఆంగ్ల  పంచాగం ప్రకారం  1)డిసెంబరు  22వ  తెదీనాదు  మకర  సంక్రమణం  లేదా  ఉత్తరాయన  పుణ్యకాలము  అంటారు .
2)మార్చి  21టవ  తెదీని  వుత్తర  విఘవం  లేదా  మేష సంక్రమణం   అందురు . 3)జూన్  22వ తెదీనాదు  దక్షిణాయనం  ప్రారంభం  లేదా కర్కాటక  సంక్రమణం  . 4)సెప్టెంబరు  21వ  తెదీనాదు  దక్షిణ  విఘవం  లేదా
  తులా సంక్రమణం ఈ  దక్షిణ  విఘవం  నాడు సూర్యుడు  వుత్తరం  నుండి  దక్షిణమునకు  భూమధ్యరేఖను
మారుచుండును దాటును . .ఈ  గమనములను  బట్టి  సూర్యుని  నుండి  భూమి  స్వీకరించు  సూర్యరశ్మి  యొక్క  కోణములు మారుచుండును .వానిని  బట్టి  శీతోష్ణ స్థితులు  ,వాయుగమనం  మారుతాయి . వానిని  బట్టి  వెసవి
కాలం ,వర్షాకాలం ,శీతాకాలము  మొదలవుతాయి .









 





















.





























కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి