గౌరవనీయులు ,పూజ్యులు ,మహానుభావులు ,శ్రీ ,ఎక్కిరాల కృష్ణమాచార్య గారు రచించిన శ్రీమద్భాగవత ప్రకాశము పంచమ స్కందం ద్వితీయ భాగం 13 నందు అమూల్యమైన కొన్ని వివరాలను అందరము వారు తెలుసుకోవాలనే తపనతో తెలియపరుస్తున్నాను , ఆచార్యులవారి పాదాలకు ప్రణమిల్లుతూ వ్రాస్తున్నాను వారు వ్రాసిన వాక్యాలను యథాతథంగా వ్రాస్తున్నాను .
సూర్యుని సంవత్సర గమనము నందు ఉత్తరాయనము దక్షిణాయనము విఘవము అను గమనములు వున్నవి వుత్తరాయనమున పగలు దీర్ఘముగా రాత్రి . చిన్నగా వుండును . దక్షిణాయనము రాత్రి దీర్ఘముగా
పగలు చిన్నగా వుండును . విఘవములందు పగలు రాత్రి సమానముగా వుండును . ఏ దినమునందు మిక్కిలి దీర్ఘమైన రాత్రి మిక్కిలి చిన్నదైన పగలు వచ్చునో ఆ మరుసటి దినమునుంది ఉత్తరాయనము ప్రారంభమగును . పగలు పెరిగి రాత్రి తగ్గుచుండును . మూడు మాసములలో రాత్రి పగలు సమానముగా వున్న దినము వచ్చును . ఆ నాటి సూర్యోదయమును విఘవము అందురు . అదియే విఘవత్పుణ్య
కాలమందురు . ఆ నాడు సూర్యుడు భూమధ్యరేఖను దక్షిణము నుండి ఉత్తరము నకు దాటును . అదియే
మేషరాశి ప్రారంభము .ఆ దినమునుంది పగళ్ళు పెరిగి రాత్రుళ్ళు చిన్నవగుచుండును . మరల మూడు
మాసములలో అతి దీర్ఘమైన పగలు అతి చిన్నదైన రాత్రి గల దినము వచ్చును . ఆ మరునాటి సూర్యోదయమునుంది దక్షిణాయనం ప్రారంభమగును .దీనినే కర్కాటక రాశి ప్రారంభం అని చెప్పవచ్చును.
ఆ రోజునుండి రాత్రులు పెరుగుతూ పగళ్ళు చిన్నవిగా అవుతూ వుంటాయి . మూడు మాసముల పిదప రాత్రి పగలు సమానమైన దినం వస్తుంది . దీనిని దక్షిణ విఘవం అందురు . ఆ రోజు నుండి సూర్యుడు
తులా రాశి లో ప్రవేశిస్తాడు . ఆ దినం నుండి పగలు చిన్నగా రాత్రి పెద్దదిగా అవుతుంది . మరల మూడు
మాసములలో అతి దీర్ఘమైన రాత్రి అతి చిన్న పగలు గల దినం యేర్పడుతుంది . ఆ మరుసటి రోజు నుండి
ఉత్తరాయనం ప్రారంభం అవుతుంది . దీనినే మకర రాశి ప్రారంభం అందురు . ఈ లెక్కలన్నీ లంకా పట్టణ ప్రదేశమున నిలబడి గుణించి నప్పుడే సరిగా వచ్చును . లంక అనగా భూమధ్యరేఖ . ఈ విధంగా సంవత్సరమున మూడేసి నెలల కొకటి చొప్పున నాలుగు పాదములు వచ్చును .ఇప్పటి ఆంగ్ల పంచాగం ప్రకారం 1)డిసెంబరు 22వ తెదీనాదు మకర సంక్రమణం లేదా ఉత్తరాయన పుణ్యకాలము అంటారు .
2)మార్చి 21టవ తెదీని వుత్తర విఘవం లేదా మేష సంక్రమణం అందురు . 3)జూన్ 22వ తెదీనాదు దక్షిణాయనం ప్రారంభం లేదా కర్కాటక సంక్రమణం . 4)సెప్టెంబరు 21వ తెదీనాదు దక్షిణ విఘవం లేదా
తులా సంక్రమణం ఈ దక్షిణ విఘవం నాడు సూర్యుడు వుత్తరం నుండి దక్షిణమునకు భూమధ్యరేఖను
మారుచుండును దాటును . .ఈ గమనములను బట్టి సూర్యుని నుండి భూమి స్వీకరించు సూర్యరశ్మి యొక్క కోణములు మారుచుండును .వానిని బట్టి శీతోష్ణ స్థితులు ,వాయుగమనం మారుతాయి . వానిని బట్టి వెసవి
కాలం ,వర్షాకాలం ,శీతాకాలము మొదలవుతాయి .
.
సూర్యుని సంవత్సర గమనము నందు ఉత్తరాయనము దక్షిణాయనము విఘవము అను గమనములు వున్నవి వుత్తరాయనమున పగలు దీర్ఘముగా రాత్రి . చిన్నగా వుండును . దక్షిణాయనము రాత్రి దీర్ఘముగా
పగలు చిన్నగా వుండును . విఘవములందు పగలు రాత్రి సమానముగా వుండును . ఏ దినమునందు మిక్కిలి దీర్ఘమైన రాత్రి మిక్కిలి చిన్నదైన పగలు వచ్చునో ఆ మరుసటి దినమునుంది ఉత్తరాయనము ప్రారంభమగును . పగలు పెరిగి రాత్రి తగ్గుచుండును . మూడు మాసములలో రాత్రి పగలు సమానముగా వున్న దినము వచ్చును . ఆ నాటి సూర్యోదయమును విఘవము అందురు . అదియే విఘవత్పుణ్య
కాలమందురు . ఆ నాడు సూర్యుడు భూమధ్యరేఖను దక్షిణము నుండి ఉత్తరము నకు దాటును . అదియే
మేషరాశి ప్రారంభము .ఆ దినమునుంది పగళ్ళు పెరిగి రాత్రుళ్ళు చిన్నవగుచుండును . మరల మూడు
మాసములలో అతి దీర్ఘమైన పగలు అతి చిన్నదైన రాత్రి గల దినము వచ్చును . ఆ మరునాటి సూర్యోదయమునుంది దక్షిణాయనం ప్రారంభమగును .దీనినే కర్కాటక రాశి ప్రారంభం అని చెప్పవచ్చును.
ఆ రోజునుండి రాత్రులు పెరుగుతూ పగళ్ళు చిన్నవిగా అవుతూ వుంటాయి . మూడు మాసముల పిదప రాత్రి పగలు సమానమైన దినం వస్తుంది . దీనిని దక్షిణ విఘవం అందురు . ఆ రోజు నుండి సూర్యుడు
తులా రాశి లో ప్రవేశిస్తాడు . ఆ దినం నుండి పగలు చిన్నగా రాత్రి పెద్దదిగా అవుతుంది . మరల మూడు
మాసములలో అతి దీర్ఘమైన రాత్రి అతి చిన్న పగలు గల దినం యేర్పడుతుంది . ఆ మరుసటి రోజు నుండి
ఉత్తరాయనం ప్రారంభం అవుతుంది . దీనినే మకర రాశి ప్రారంభం అందురు . ఈ లెక్కలన్నీ లంకా పట్టణ ప్రదేశమున నిలబడి గుణించి నప్పుడే సరిగా వచ్చును . లంక అనగా భూమధ్యరేఖ . ఈ విధంగా సంవత్సరమున మూడేసి నెలల కొకటి చొప్పున నాలుగు పాదములు వచ్చును .ఇప్పటి ఆంగ్ల పంచాగం ప్రకారం 1)డిసెంబరు 22వ తెదీనాదు మకర సంక్రమణం లేదా ఉత్తరాయన పుణ్యకాలము అంటారు .
2)మార్చి 21టవ తెదీని వుత్తర విఘవం లేదా మేష సంక్రమణం అందురు . 3)జూన్ 22వ తెదీనాదు దక్షిణాయనం ప్రారంభం లేదా కర్కాటక సంక్రమణం . 4)సెప్టెంబరు 21వ తెదీనాదు దక్షిణ విఘవం లేదా
తులా సంక్రమణం ఈ దక్షిణ విఘవం నాడు సూర్యుడు వుత్తరం నుండి దక్షిణమునకు భూమధ్యరేఖను
మారుచుండును దాటును . .ఈ గమనములను బట్టి సూర్యుని నుండి భూమి స్వీకరించు సూర్యరశ్మి యొక్క కోణములు మారుచుండును .వానిని బట్టి శీతోష్ణ స్థితులు ,వాయుగమనం మారుతాయి . వానిని బట్టి వెసవి
కాలం ,వర్షాకాలం ,శీతాకాలము మొదలవుతాయి .
.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి