12, అక్టోబర్ 2015, సోమవారం

ఆలోచనలు - ఆచరణలు

ద్సష్టిలో  ప్రతిజీవి  కి  మనసు ,హృదయం ,మెదడు  వున్నాయి .  ప్రతి  జీవి  తనదైన  భాషను  వాడుతుంది . అన్ని  జీవుల  భాషలు  అన్నిజీవులకు  అర్ధం  కావు . భావం  ఒకటే  అయినా  భావప్రకటన  భాష  వేరు . గోమాత  పలికే
"అంబా "లో  యెన్నో  భావాలు !సునిశితం గా  పరిశీలిస్తే  ఆ  అరుపులో  ఆవేశంలో  ఒకరకంగా ,ఆవేదనలో  ఒకరకంగా ,ఆప్యాయతలో  ఒకరకంగా  భావాలు  పలుకుతాయి . అలాగే  ప్రతిజీవి  తన  భాషలో  తనభావాలను తెలుపుతుంది . మనం  బుద్ధి జీవులం !బుద్దితో  అలోచించి  సంస్కారమైన  భాష  వుపయోగించి భావ  ప్రకటన
చేస్తాము .పశువు  ఆలోచిస్తుంది , మనం  ఆలోచిస్తాం . పశువు  ఆలోచనలు  సమాజాన్ని  ప్రభావితం  చెయ్యవు .
కానీ  మన  ఆలోచనలు   భాష  ఎదుటి  మనిషిని  ప్రభావితం  చేస్తాయి . అందువల్ల  పర్యవసానం  ఎలా
వుంటుందో!కాబట్టి  ఆలోచనా సరళి సక్రమంగా  వుండాలి . ఆలోచన  సక్రమం ,ఆచరణ  సక్రమం  అయితే  అందరు హాయిగా  వుంటారు . అలేగ్జాందర్  ఎంతో  తెలివిగలవాడు  కాని  ఆలోచన  ఆచరణ  సరిగా  లేవు .  చరిత్రలో  నిలిచినా  నరహంతకుడిగానే  నిలిచి  పోయాడు . గాంధీజీ  ఆలోచన  ఆచరణా  సక్రమం  అవటం  వల్ల  మహాత్ముడు  అయ్యారు ,జాతిపితగా  అందరి  మనసుల్లో  నిలిచిపోయారు .
 మన  ఆలోచనే  మనల్ని  విజయపథంలోకి  నడిపిస్తుంది . ఆలోచనాప్రవాహానికి  దిశా నిర్దేశం  కావాలి . ఒకసమస్య  దానికి సక్రమ  ఆలోచన ,ఆలోచనలోనించి  సక్రమ  పరిష్కారం ,నిర్మాణాత్మక  ఆచరణ  యివే  మనిషిని  మనీషి గా  నిలబెడుతాయి . భ్రమలో  జీవించ వద్దు ,భ్రమ  అనే  మత్తులో  తేలవద్దు ,సత్యంలో  జీవించి  సత్యాన్వేషణ  చేసినప్పుడే  ఆలోచనలు  సత్ఫాలిస్తాయి . లేనిది వూహించుకుని ,మెదడును  మనసును  కలుషితం  చేసుకోకూడదు . నిజం  లోనించి  నిజాయితీ  నిలబడాలి . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి