27, అక్టోబర్ 2015, మంగళవారం

కదలిక కావాలి (రావాలి)

భారత నారి  గౌరవానికి  మర్యాదకు  సకల  జాతులకే  తలమానికంగా  నిలిచింది , మన  సనాతన  ధర్మంలో  , మన  వేదాలలో  స్త్రీ  స్థానం  ఉన్నతం ఆనాటి  పురుషుడు! మహిళకు  సంకెళ్ళు  బిగించలేదు . ప్రతి  రంగంలో  సమాన
విలువ  యిచ్చాడు . మరి  యిప్పుడు  మనం  అన్నిరంగాలలో  మహిళలు పురోగమనంలో  వున్నారు . వున్నతంగా  జీవిస్తున్నారు .  కాని  మనం  జీవిస్తున్న  యీ  సమాజంలో  యెందుకు  యిన్ని  మానభంగాలు ?
అంతేకాదు  చంపడాలు, ముక్కలు ,ముక్కలు  గా  కోయదాలు !యేమిటి  యీ  వికృత  ధోరణి ? మానవుడు
దానవుడుగా  మారుతున్నాడు .  రావణాసురుడు  సీతను  బంధించాడు ,కానీ ,అంత  దానవుడు  కొంత  కట్టుబాటుకు  తల  వంచాడు .  యినాటి  యీ  నేర ధోరణి  ఆనాటి  రాక్షసులకన్నా  దారుణంగా  వున్నది .
రోజూ  దినపత్రికలో  వార్తలు  చదువుతున్నా ,t.v  లో  చూస్తున్నా మనసంతా  చెదిరి  పోతున్నది . మనదేశంలో
పాపాయి  భూమిమీదికి  వస్తూ  తనతో  పాటే   యీ  అత్యాచార విష సర్పాన్ని  మెళ్ళో  వేసుకుని  వస్తున్నదేమో !
నెలల  పిల్ల  దగ్గరినించి ,పండు  ముదుసలి  దాకా  ఆడ  అయితే  చాలు  కామం  తీర్చుకోవడానికి !మొన్ననే
పేపర్లో  చదివాను  ఒక  కామపిశాచి పూడ్చిన  స్త్రీ  శవాన్ని  బయటకు  తీసి   కోరిక  తీర్చుకున్నాదు .  వాణ్ని  చంపినా  పాపం  లేదు / చిఛీ /అసహ్యం  వేస్తోంది .ఆకాశం లో  సగం  అని  చెప్పుకోవడానికే  ఆడాళ్ళు  వున్నారు /
ఆచరణలో  శూన్యమ్ .
అసలెందుకిలా  జరుగుతున్నది ? ఎక్కడుంది  లోపం ? మనిషి  మెదడులో  యీ  కలుపు మొక్కలు  విష వలయాలుగా  అల్లుకు  పోతున్నాయి . వాటిని  వేళ్ళతో  తుంచెయ్యాలి . క్రూరమైన  ఆలోచనలు  యెందుకు
వస్తున్నాయి ?జాలి  దయ ,మానవత్వం  అనే  పదాలు  మాయమైపోయాయి !మనసమాజంలో  విలువలకు
వలువలు  వలస  వెళ్ళాయి . సంస్కారాన్ని  మన  పదకోశంలో  కప్పెసాం . సమయం  వచ్చేసింది ,ప్రతి  పాఠశాలలొ  తప్పని  సరిగా  విలువలను  బోధించాలి . పెద్దవారు  అనుభవజ్ఞులు , విద్యావంతులు ,మన  రామాయణం  ,
వేమన శతకం  భాగవతం    అందులోని  మానవతావిలువలు  వివరిస్తే  యిన్ని  అనర్ధాలు  జరగవు . ప్రతి  వ్యక్తి
ప్రతి  అమానుష  చర్యను  ఖండించాలి . మనలోని  అలసత్వాన్ని  తరిమెయ్యాలి ,జాతిని  కాపాడుకోవాలి .
మనకెందుకులే  ,మనింట్లో  కాదుగా  అనే  ధోరణి  మారాలి . సమాజం  మనదే  సమస్యలు  కూడా  మనవే !క్ట ఒక  మహిళను  చంపేసి  గొనెసంచీలొ  కుక్కేసి  గోడలో  పెట్టేసి  ప్లాస్ట రింగ్  చేసారంటే వాళ్ళు  అసలు  రాక్షసులే !
పక్కింటి వాళ్ళకు  యింతపని  జరుగుతున్నా  చప్పుడు  వినిపించలేదా ?తప్పకుండా  వినిపిస్తుంది  కానీ
మనకెందుకులే  అని  వూరు కున్నారు . ప్రతి వాళ్ళు  మనచుట్టుపక్కల  కదలికలు  గమనిస్తూ వుండాలి .  అనుమానం  వస్తే  అందరూ  కలిసి  నిలదియ్యాలి . నీతిమాలిన  చర్యలను  అరికట్టాలి .
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి