చిటెక్నాలజీ పెరిగింది !మరి దాని పరిణామాలు ?స్వేచ్ఛ జన్మహక్కు !ఎప్పుడు ?పెడదారి పట్టనంతకాలం ! పిల్లలకు తల్లితండ్రులు అన్ని వసతులు యేర్పరుస్తున్నారు!చాలా సంతోషం ! కానీ పర్యవేక్షణ మర్చిపోతున్నారు .ఒకవిధం గా యువతలో అభద్రతాభావం వారిని వక్రమార్గంలోకి తోస్తున్నది !రోజూ పిల్లలదగ్గర కూచుని బళ్ళో విషయాలు అడిగి తెలుసుకోవాలి !వాళ్ళు చెప్పేది వినాలి !కానీ నేటి తల్లితండ్రులకి ఆ ఓపికలేదు !బడి నించి రాగానే వెంటనే ట్యూషన్ కి పంపెయ్యాలి !అక్కడినించి రాగానే డిన్నర్ ! అప్పుడు కాసేపు వాళ్ళని దగ్గరగా ప్రశ్నించితే సమస్యలు తలెత్తవుగా స్వేచ్హహకు హద్దుగియ్యాలి !పిల్లలతో పెద్దలు సాంకేతిక విషయాలలో అవగాహన కలిగివుండాలి !అతిస్వేచ్ఛ వినాశనానికి మార్గం యేర్పరుస్తుంది,పాఠశాలలు కూడా విద్యార్ధులపై నిఘా ఉంచాలి ,మనం మొక్క నాటుతాం !రోజూ నీళ్లు పోస్తాం! దాని యెదుగుదల ఆకుపచ్చని ఆకులు చూసి ఆనందిస్తాం !అదేసమయంలో మొక్కకు మట్టి ఎరువు ఆలోచిస్తాం !పురుగు పడితే మందు వేస్తాం !మార్గాలు వెతుకుతాం !పిల్లలూ మొక్కలాంటి వారే !తప్పు వారిది కాదు !పెద్దల్లారా కళ్ళు తెరవండి !సంపాదన పిల్లలకోసమేగా ?మరి ఆ పిల్లలే విషవలయం లో క్కుకుంటే మీ సంపాదన వాళ్ళను వైద్యుల చుట్టూ తిప్పటానికి సరిపోతుంది ! ధనార్జనలో పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత మర్చిపోవద్దు ప్లీజ్ !
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి